నేడు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 554 పాయింట్లు పతనం, అదే బాటలో నిఫ్టీ

Ashok Kumar   | Asianet News
Published : Jan 18, 2022, 04:52 PM IST

నేడు మంగళవారం స్టాక్ మార్కెట్ (stockmarket)ఉదయం పెరుగుదలతో ప్రారంభమై చివరకు రెడ్ మార్క్‌లో ముగిసింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) 30 షేర్ల సెన్సెక్స్ 555 పాయింట్లు నష్టపోయి 60,755 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) నిఫ్టీ 195 పాయింట్ల బలమైన పతనం తర్వాత 18,113 వద్ద ముగిసింది.    

PREV
13
నేడు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 554 పాయింట్లు పతనం, అదే బాటలో నిఫ్టీ

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ 
ఈ రోజు  ఉదయం స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 119 పాయింట్ల లాభంతో 61,428 వద్ద ప్రారంభం కాగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) నిఫ్టీ 36 పాయింట్లు జంప్ చేసి 18,344 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది.

23

నిన్న అంటే  సోమవారం స్టాక్ మార్కెట్ లాభాలలో ప్రారంభమైంది. రోజంతా అస్థిర ట్రేడింగ్ తర్వాత చివరకు స్వల్ప లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 86 పాయింట్ల జంప్ చేసి 61,309 వద్ద ముగియగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 52 పాయింట్ల లాభంతో 18,300 స్థాయిని దాటుకుని 18,308 వద్ద ముగిసింది.

అంతర్జాతీయ మార్కెట్​లో చమురు ధరలు మరింత పెరగడంతో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పాటు ఐటీ, మెటల్​, ఫార్మా రంగాల్లో అమ్మకాల జోరు కొనసాగడం వల్ల సూచీలు భారీగా నష్టపోయాయి.
 

33

నేడు డాలరుతో రూపాయి మారకం వీలువ రూ.74.58 వద్ద ఉంది. నిఫ్టీలో టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, మారుతి సుజుకి, అల్ట్రాటెక్ సిమెంట్, ఐషర్ మోటార్స్, టెక్ మహీంద్రా షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు అధికంగా లాభపడ్డాయి. ఆటో, ఐటీ, క్యాపిటల్ గూడ్స్, మెటల్, రియాల్టీ, ఫార్మా, ఎఫ్ఎంసిజి 1-2 శాతంతో నష్టాల్లో ముగిశాయి. బిఎస్ఇ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 1-2 శాతం తగ్గాయి.

click me!

Recommended Stories