బడ్జెట్ 2022 : టూ వీలర్స్, యూజ్డ్ కార్లపై జి‌ఎస్‌టి ధరల తగ్గింపు, ఖత్చితమైన నిర్ణయాలు కోరిన ఎఫ్‌ఏ‌డి‌ఏ..

First Published Jan 18, 2022, 3:54 PM IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  మరికొద్ది రోజుల్లో బడ్జెట్ 2022-23ను  ప్రవేశపెట్టనున్నారు. అయితే ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ అలాగే ఆటో డీలర్‌షిప్‌లను ప్రభావితం చేసే కొన్ని సమస్యలను లేవనెత్తింది.

ఆటో రిటైల్ ట్రేడ్ ని పునరుజ్జీవింపజేయాలని కోరుతూ భారతీయ ఆటోమొబైల్ రిటైలర్‌ల అపెక్స్ బాడీ ఆదాయపు పన్ను చెల్లించే వారి కోసం వాహనాలపై తగ్గింపు  ప్రయోజనాలను కోరింది.  ఇది ఎఫ్‌ఏ‌డి‌ఏ ప్రకారం ఐ‌టి రిటర్న్‌లను దాఖలు చేసే వారి సంఖ్యను పెంచడంలో మాత్రమే కాకుండా ఆటోమొబైల్ డిమాండ్‌ను పెంచడంలో సహాయపడుతుంది ఇంకా ప్రభుత్వానికి జి‌ఎస్‌టి సేకరణను కూడా పెంచుతుంది. 

కార్పోరేట్ ఇంకా ప్రతి ఒక్కరికీ కోసం వాహనాల విలువ తగ్గుతాయి కాబట్టి జీతాలు తీసుకునే వారు కూడా అదే ప్రయోజనాన్ని పొందడం న్యాయపరమైనది అని ఎఫ్‌ఏ‌డి‌ఏ ఒక ప్రకటనలో తెలిపింది. 31 మార్చి 2020 వరకు మాత్రమే చెల్లుబాటు అయ్యే డిప్రీసియేషన్ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని అసోసియేషన్ కోరింది.
 

ద్విచక్ర వాహన విక్రయాలలో వాల్యూమ్‌లను పెంచడానికి జి‌ఎస్‌టి రేట్ల నియంత్రణకు సంబంధించి ఎఫ్‌ఏ‌డి‌ఏ చేసిన మరొక సిఫార్సు. ద్విచక్ర వాహనాలపై జిఎస్‌టి రేట్లను 18 శాతానికి తగ్గించడం వల్ల పరిశ్రమ అండ్ ఆటో రిటైల్ బిజినెస్ తిరిగి వృద్ధి బాటలో పడుతుందని అసోసియేషన్ పేర్కొంది. 

డిమాండ్‌ను సమర్థిస్తూ ఎఫ్‌ఏ‌డి‌ఏ  ద్విచక్ర వాహనాలను లగ్జరీగా ఉపయోగించకుండా, వారి రోజు  అవసరాల కోసం కింద తరగతి అండ్ గ్రామీణ విభాగాల వారు దూరం ప్రయాణించాడానికి  ఒక అవసరంగా ఉపయోగిస్తున్నట్లు పేర్కొంది. అందువల్ల, లగ్జరీ ఉత్పత్తులపై వర్తించే 28 శాతం జి‌ఎస్‌టి + 2 శాతం సెస్  ద్విచక్ర వాహన వర్గానికి మంచిది కాదు. ఇంకా ఎఫ్‌ఏ‌డి‌ఏ  ప్రకారం ప్రస్తుతం లోహాల ధరల నిరంతర పెరుగుదల అలాగే  ఇతర కారణాల వల్ల ప్రతి మూడు-నాలుగు నెలల విరామం తరువాత వాహనాల ధరలు పెరుగుతున్నాయి. కాబట్టి, జి‌ఎస్‌టి రేటు తగ్గింపు ధరల పెరుగుదలను ఎదుర్కొంటుంది ఇంకా డిమాండ్‌ను పెంచడంలో సహాయపడుతుంది.
 

ఆటో రిటైలర్స్ బాడీ కూడా ఉపయోగించిన కార్ల కోసం జి‌ఎస్‌టి రేట్లను ప్రస్తుత రేటు 12 శాతం (సబ్-4000ఎం‌ఎం వాహనాలకు) ఇంకా 18 శాతం (4000 mm కంటే ఎక్కువ వాహనాలకు) నుండి ఐదు శాతానికి తగ్గించాలని కోరింది. కొత్త కార్ మార్కెట్ కంటే యూజ్డ్ కార్ల వ్యాపారం 1.4 రెట్లు ఆక్రమించిందని, రూ. 1.75 ట్రిలియన్లకు పైగా టర్నోవర్‌తో సంవత్సరానికి 5-5.5 మిలియన్ కార్లు ఉన్నాయని అసోసియేషన్ పేర్కొంది. 
 
ఉపయోగించిన వాహనాలకు మార్జిన్‌పై ఏకరీతి జీఎస్‌టీ రేటు 5 శాతం ఉంటే, ప్రభుత్వం, డీలర్లు ఇంకా వాహన యజమానులు ముగ్గురికీ సంతోషానికి దారితీస్తుందని ఎఫ్‌ఏ‌డి‌ఏ తెలిపింది. జి‌ఎస్‌టి తగ్గింపు పరిశ్రమ ఆన్ ఆర్గనైజేడ్ విభాగం నుండి ఆర్గనైజేడ్ విభాగానికి మారడానికి సహాయపడుతుంది, తద్వారా పన్ను లీకేజీలకు బ్రేక్ వేస్తూ జి‌ఎస్‌టి పరిధిలోకి మరింత వ్యాపారాన్ని తీసుకురావడంలో సహాయపడుతుందని పేర్కొంది.

26,500 డీలర్‌షిప్‌లతో 15,000 ఆటోమొబైల్ డీలర్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎఫ్‌ఏ‌డి‌ఏ ఇండియా ఎల్‌ఎల్‌పి, యాజమాన్య అండ్ భాగస్వామ్య సంస్థల కోసం కార్పొరేట్ పన్నును తగ్గించాలని కోరింది. 400 కోట్ల రూపాయల వరకు టర్నోవర్ ఉన్న ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు కేంద్రం కార్పొరేట్ పన్నును 25 శాతానికి తగ్గించిందని, అసోసియేషన్ కూడా ఎల్‌ఎల్‌పి, యాజమాన్య అండ్ భాగస్వామ్య సంస్థలకు ఇలాంటి ప్రయోజనాలను కోరింది. 

ఇది 5 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తున్న వ్యాపారుల ధైర్యాన్ని ఇంకా సెంటిమెంట్‌ను పెంచడంలో సహాయపడుతుందని ఎఫ్‌ఏ‌డి‌ఏ పేర్కొంది, వీరిలో 2.5 మిలియన్ల మంది ఉద్యోగులు ప్రత్యక్ష ఉపాధిలో ఉన్నారు. ఆటో పరిశ్రమ ఏ దేశ ఆర్థిక పనితీరుకు బేరోమీటర్ అని నొక్కిచెప్పిన ఎఫ్‌ఏ‌డి‌ఏ ఈ రంగం వృద్ధిని ప్రోత్సహించడానికి సాహసోపేతమైన చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేసింది.

click me!