శివుడి మెడలోని పాము పేరు వాసుకి. ఇది పాములకు రాజుగా పేరుపొందింది. పురాణాల ప్రకారం క్షీరసాగర మధనం సమయంలోనూ వాసుకి పామునే ఉపయోగించారట. అందుకే అతి పొడవైన, ఎక్కువ బోగీలు కలిగిన ఈ ట్రైన్ కి కూడా వాసుకి అని పేరు పెట్టారు.
ఈ సూపర్ వాసుకి ట్రైన్ ఒక ట్రిప్ లో 27 వేల టన్నుల బొగ్గును తరలిస్తుంది. ఈ ట్రైన్ ఖొర్బా, రాజ్ నంద్ మధ్య ప్రయాణించడానికి 11 గంటల 20 నిమిషాలు తీసుకుంటుంది. ఈ ట్రైన్ దాని పరిమాణం, బరువు వల్ల గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను కూడా సాధించింది. ఇది 22 జనవరి 2021న ప్రారంభమైంది. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే(SECR) జోన్లోని రాయ్పూర్ డివిజన్ ద్వారా నడుస్తోంది.