కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వ ఖాతాల్లో నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)తో అన్ని లావాదేవీలను నిలిపివేసింది. ఈ నిర్ణయం రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా అమలులోకి వచ్చింది. అన్ని ప్రభుత్వ శాఖలు, పబ్లిక్ ఎంటర్ప్రైజులు, కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు, యూనివర్సిటీలు, ఇతర సంస్థలు తమ ఖాతాలను SBI, PNB లలో రద్దు చేసుకోవాలని ఆదేశాలిచ్చింది కర్ణాటక ప్రభుత్వం.