కొన్ని నెలల క్రితం వరకు రూ.19 వోచర్ రూ.15లకు, రూ.29 వోచర్ రూ.25కి లభించేది. 2024 సంవత్సరం ప్రారంభంలో అమలు చేసిన టారిఫ్ పెంపుదల వల్ల ఈ వోచర్ల ధర కూడా పెరిగిపోయింది.
రూ.19 డేటా వోచర్ రీఛార్జ్ చేసుకుంటే వినియోగదారుడి బేసిక్ ప్లాన్ ఉన్నంత వరకు చెల్లుబాటు అయ్యేది. అంటే.. వినియోగదారు బేసిక్ ప్లాన్ 70 రోజుల వరకు చెల్లుబాటు అయితే, అతను రూ.19 డేటా వోచర్ కూడా వేయించుకుంటే 70 రోజులు లేదా డేటా పూర్తిగా ఉపయోగించే వరకు పని చేసేది. అయితే ఇప్పుడు రూ.19 డేటా వోచర్ వ్యాలిడిటీని కేవలం 1 రోజుకు పరిమితం చేశారు. కాబట్టి రూ.19 డేటా వోచర్ కొత్త వ్యాలిడిటీ 1 రోజు మాత్రమే. రోజు దాటితే అందులో డేటా మిగిలిపోయినా తర్వాత ఉపయోగించడానికి అవకాశం ఉండదు.