ఇండియాలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన BSNLతో పాటు జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలు కూడా టెలికాం సేవలను అందిస్తున్నాయి. జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా వంటి కంపెనీలు టారిఫ్ ధరలు పెంచినప్పటికీ వినియోగదారులకు మెరుగైన నెట్వర్క్ సేవలు అందిస్తున్నాయి.
జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా లు 3G, 4G లను దాటి ఇప్పటికే 5G సేవలను అందిస్తున్నాయి. బీఎస్ఎన్ఎల్ 4G సేవలు దేశవ్యాప్తం చేస్తూనే కొన్ని ముఖ్య నగరాల్లో 5G సేవలు కూడా ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో పోటీ కంపెనీల కంటే మరో ముందడుగు వేసింది. 5.5G నెట్వర్క్ను ప్రారంభించింది.