కరెన్సీ నోట్లనే కాకుండా కాయిన్స్ ని కూడా వేరే పనులకు అక్రమార్కులు వాడుతున్నారు. చిల్లరను భారీగా సేకరించి బంగ్లాదేశ్ తదితర దేశాల్లో వాటితో కత్తులు తయారు చేస్తున్నారట. అందుకే ఆర్బీఐ పాత నోట్లు, కాయిన్స్ స్థానంలో కొత్త కరెన్సీని విడుదల చేస్తోంది.
రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.10 నోట్లను కొత్తగా ప్రింట్ చేసి మార్కెట్లోకి వదిలింది. అయితే కొత్త నోట్లకు కూడా నకిలీవి తయారు చేసేస్తున్నారు. ఇప్పటికే రూ.500 నోట్లు నకిలీవి చలామణిలో ఉండటంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.