27 అంతస్తుల యాంటిలియాలో ముఖేష్ అంబానీ ఏ ఫ్లోర్ లో ఉంటారో తెలుసా

First Published Oct 4, 2024, 10:39 AM IST

దేశంలోనే అత్యంత ధనవంతుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ గురించి తెలియని వారుండరు. బిజినెస్ సెక్టార్ లో ఆయన రికార్డులు సృష్టిస్తుండగా, ముంబైలోని ఆయన ఇల్లు కూడా రికార్డుల్లోకెక్కింది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన భవనాల్లో ఒకటిగా ముఖేష్ అంబానీ ఇల్లు నిలిచింది. ఆ ఇంటి పేరు యాంటిలియా(Antilia). 27 అంతస్తులున్న ఈ భవనంలో మరి ముఖేష్ అంబానీ, నీతూ అంబానీ ఏ ఫ్లోర్ లో ఉంటారో మీకు తెలుసా? రండి ఇక్కడ అలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. 
 

యాంటిలియా భవనం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవనాల్లో ఒకటి. ఇది బిలియనీర్ ముఖేష్ అంబానీ నివాసం. ఇది ముంబైలోని దక్షిణ ముంబై, ఆల్టామౌంట్ రోడ్‌లో ఉంది. ఈ భవన నిర్మాణాన్ని 2006 ప్రారంభించి 2010లో పూర్తిచేశారు. ఈ ఇంటి నిర్మాణం కోసం సుమారు 2 బిలియన్ డాలర్లు(15,000 కోట్ల రూపాయలు) ఖర్చు చేశారు. ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఇప్పుడు ఈ ఇంటి విలువ 4.6 బిలియన్ డాలర్లు. భూకంపాలను కూడా తట్టుకొని నిలబడేలా ఈ భవనాన్ని నిర్మించారు.

ఈ భవనం మొత్తం మీద 27 అంతస్తులుంటాయి. 173 మీటర్ల పొడవు, 6,070 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ఇంటి నిర్మాణం జరిగింది. ఇందులో 9 హైస్పీడ్ లిఫ్టులున్నాయి. సుమారు 3 హెలీప్యాడ్లు ఉన్నాయి. 50 సీట్లున్న మినీ థియేటర్ కూడా ఉంది. 49 బెడ్‌రూమ్‌లు, 168 పార్కింగ్ స్థలాలు, బాల్‌రూమ్ అద్భుతంగా నిర్మించారు. టెర్రస్ గార్డెన్, స్విమ్మింగ్ పూల్, స్పా, హెల్త్ సెంటర్, దేవాలయం, స్నో రూమ్ లాంటి అత్యాధునికమైన సదుపాయాలు ఈ భవనంలో ఉన్నాయి.  

ఈ భవనానికి పౌరాణిక స్పానిష్ ఫాంటమ్ ద్వీపం యాంటిలియా పేరు పెట్టారు. చికాగోలో ఉన్న US ఆర్కిటెక్చర్ సంస్థలు పెర్కిన్స్ & విల్ , లాస్ ఏంజిల్స్‌లోని హిర్ష్ బెడ్నర్ అసోసియేట్స్ ఈ భవనాన్ని రూపొందించాయి. ఈ ఇంటిలో 27 అంతస్తులు అదనపు-ఎత్తైన పైకప్పులు ఉన్నాయి. ఇందులో ఉన్నవి 27 అంతస్తులే అయినా ఈ భవనం ఎత్తుకు సమానంగా ఉన్న బిల్డింగ్ ల్లో సుమారు 60 అంతస్తులు ఉంటాయి. దీన్ని బట్టి ఒక్కో ఫ్లోర్ ఎంత ఎత్తుగా నిర్మించారో అర్థం చేసుకోవచ్చు. 

Latest Videos


రిక్టార్ స్కేల్ ప్రకారం 8 తీవ్రతతో భూకంపం వచ్చినా ఈ భవనానికి ఏమీ కాదు.  ఇందులో 600 మంది సిబ్బంది పనిచేస్తారు. ఇంటీరియర్ డిజైన్ లోటస్, సూర్యుని ఆకారాలను ఉపయోగిస్తుంది. ఇందులో ఏ రెండు అంతస్తులు ఒకేలా ఉండవు. ఒక్కో అంతస్తుకు ఒక్కో విధమైన మెటీరియల్స్, ప్లాన్‌తో నిర్మించారు. 

400,000 చదరపు అడుగుల, 570 అడుగుల ఎత్తులో ఉన్న యాంటిలియాలో ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా, కుమారులు అనంత్, ఆకాష్, కోడళ్లు శ్లోక, రాధిక, మనవరాలు వేద కలిసే ఉంటారు. ఈ భారీ భవనంలోని ముఖేష్ అంబానీ కుటుంబం మొత్తం ఏ అంతస్తులో ఉంటుందో తెలుసా. 27వ అంతస్తును వారి నివాసానికి అంబానీ కుటుంబం ఉపయోగించుకుంటోంది. దీనికి ప్రత్యేక ప్రవేశం కూడా ఉంది. దీని ద్వారా కొంతమందికి మాత్రమే లోపటికి ఎంట్రన్స్ ఉంటుంది. 

ముఖేష్ అంబానీకి Antiliaతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక విలాసవంతమైన ఇళ్లు, ప్రాపర్టీలు ఉన్నాయి. 
యునైటెడ్ కింగ్ డమ్ లండన్ లో స్టోక్ పార్క్ (Stoke Park) పేరులో ఇల్లు ఉంది. ఇది లండన్ సమీపంలోని బకింగ్హామ్‌షైర్ వద్ద ఉంది. దీని ఖరీదు సుమారుగా రూ.592 కోట్ల ఉంటుంది. ఈ ప్రాపర్టీ 300 సంవత్సరాల క్రితం నాటిది. దీనిలో గోల్ఫ్ కోర్స్, 49 బెడ్‌రూమ్‌లు ఉన్నాయి. ఇది ప్రస్తుతం ప్రఖ్యాత హోటల్‌గా ఉపయోగంలో ఉంది. అంబానీ 2021లో దీన్ని కొనుగోలు చేశారు. 

అదే విధంగా ముంబై సమీపంలోనే ముఖేష్ అంబానీకి మరో ఇల్లు ఉంది. ఇది ముంబై సమీపంలోని అలిబాగ్ సమీపంలో ఉన్న బీచ్ హౌస్(Beach House). దీని ఖరీదు సుమారుగా రూ.120 కోట్లు. ఇది సముద్ర తీరం దగ్గర ఉండటంతో కుటుంబ విహారయాత్రల కోసం వచ్చిన ప్రముఖులు దీన్ని వినియోగించుకుంటారు. 

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్ లో అత్యంత్య ఖరీదైన ఇంటిని ముఖేష్ అంబానీ సొంతం  చేసుకున్నారు. దీని విలువ సుమారుగా రూ.640 కోట్లు. ఈ ఇంటిలో ప్రైవేట్ బీచ్ కూడా ఉంది. హెలీపాడ్, అనేక లగ్జరీ సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. ఇది అంబానీ కుటుంబం ఆగ్నేయ ఆసియా విహారయాత్రల కోసం ఉపయోగించే ప్రదేశంగా పేరు పొందింది. 

ఇది అంబానీ కుటుంబం ఇటీవల కొనుగోలు చేసిన విల్లా ఇది. దుబాయ్ లోని పాల్మ్ జుమేరా ప్రాంతంలో ఈ విల్లా ఉంది. దీని ఖరీదు సుమారుగా రూ.640 కోట్లు ఉంటుందని అంచనా. ఇది అత్యంత ప్రఖ్యాత సముద్ర తీర ప్రాంతంలో ఉంది.

click me!