ఈ రూల్స్ పాటించని వారికి శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. 1989 రైల్వే చట్టంలోని సెక్షన్ 164, 165 ప్రకారం పేలుడు పదార్థాలు లేదా తేలికగా మండే వస్తువులను తీసుకెళ్లే వారికి రూ.1000 వరకు జరిమానా విధిస్తారు. లేదా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఒక్కోసారి ఈ రెండు శిక్షలు పడే అవకాశం కూడా ఉంటుంది.
గ్యాస్ సిలెండర్, కిరోసిన్, పెట్రోల్ వంటివి తీసుకెళ్లకూడదన్న విషయం తమకు తెలియదని ఎవరైనా చెబితే అది సరైన సమాధానం కాదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఒకరి అజాగ్రత్త వల్ల వందల ప్రాణాలకు ముప్పు ఏర్పడితే అది కచ్చితంగా తప్పేనని శిక్షలు కూడా కఠినంగానే ఉంటాయని అధికారులు చెబుతున్నారు. బోగీలు, రైల్వే స్టేషన్లలో కూడా ధూమపానం చేయడం నేరమే.