రైల్వే డేటా ప్రకారం 21 శాతం టికెట్లు రద్దు అవుతున్నాయి. 4 నుండి 5 శాతం ప్రయాణికులు తాము బుక్ చేసిన టికెట్లలో ప్రయాణించడం లేదు. దీనివల్ల చాలామంది ప్రయాణికులకు సీట్లు దొరకడం లేదు. ఈ నేపథ్యంలోనే రైల్వే కొత్త నియమాన్ని తీసుకొచ్చింది. దీనిపై అన్ని రైల్వే స్టేషన్లు, టికెట్ కౌంటర్లకు రైల్వే నోటీసులు పంపింది.
అక్టోబర్ 31 వరకు 120 రోజుల ముందు రైలు టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని రైల్వే స్పష్టం చేసింది. ఆ టికెట్లతో వారు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ఈ నియమం నవంబర్ 1 నుండి అమల్లోకి వచ్చిందని అధికారులు ప్రకటించారు.