కరోనా లాక్ డౌన్ లో భారతీయ బిలియనీర్లు మొత్తం ఎంత సంపాదించారో తెలుసా..

First Published Jan 25, 2021, 1:04 PM IST

 కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విధించిన లక్ డౌన్ సమయంలో భారతీయ బిలియనీర్ల సంపద 35 శాతం పెరిగిందని, మరోవైపు లక్షలాది మందికి జీవనోపాధి సంక్షోభం ఏర్పడిందని పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్న ఆక్స్ఫామ్ అనే సంస్థ తెలిపింది.
 

12,97,822 కోట్లకు పెరిగిన 100 మంది బిలియనీర్ల సంపదఆక్స్ఫామ్ నివేదిక 'ఇన్ ఈక్వాలిటీ వైరస్' ద్వారా "భారతదేశంలో 2020 మార్చి తరువాత కాలంలో 100 మంది బిలియనీర్ల సంపద రూ.12,97,822 కోట్లకు పెరిగింది" అని పేర్కొంది. ఈ మొత్తాన్ని దేశంలోని 13.8 కోట్ల మంది పేద ప్రజలకు పంపిణీ చేస్తే, వారిలో ప్రతి ఒక్కరికి రూ .94,045 ఇవ్వవచ్చు.
undefined
1930 మహా మాంద్యం తరువాత జరిగిన అతిపెద్ద ఆర్థిక సంక్షోభంఆక్స్ఫామ్ నివేదికలో ఇన్ కం ఇన్ఈక్వాలిటీని ప్రస్తావిస్తూ, కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ముకేష్ అంబానీ ఒక గంటలో సంపాదించిన ఆదాయాన్ని సంపాదించడానికి స్కిల్స్ లేని ఒక సాధారణ కార్మికుడికి పదివేల సంవత్సరాలు పడుతుందని తెల్లిపింది. ఈ నివేదిక ప్రకారం, కరోనా వైరస్ మహమ్మారి గత 100 సంవత్సరాలలో అతిపెద్ద ఆర్థిక, ఆరోగ్య సంక్షోభానికి దారితీసింది. ఇది 1930 మహా మాంద్యం తరువాత అతిపెద్దది.
undefined
బిలియనీర్ల సంపద సుమారు 540 బిలియన్ డాలర్లు పెరిగింది.ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారం, ప్రపంచంలోని టాప్ 10 బిలియనీర్ల సంపద 18 మార్చి 2020 నుండి డిసెంబర్ 31 వరకు 540 బిలియన్ డాలర్లు పెరిగింది. అలాగే ఈ కాలంలో కనీసం 200 మిలియన్ల నుండి 500 మిలియన్ల మంది ప్రజలు పేదలుగా మారారని అంచనా. కరోనా వైరస్ ప్రపంచంలో ఇన్ కం ఇన్ఈక్వాలిటీని పెంచింది. ఇది విద్య, ఆరోగ్యం, మెరుగైన జీవితాన్ని గడపడంపై లోతైన ప్రభావాన్ని చూపుతుంది.
undefined
ఆక్స్ఫామ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమితాబ్ బెహార్ మాట్లాడుతూ, 'ఆర్థిక వ్యవస్థ అతిపెద్ద సంక్షోభ సమయంలో ధనవంతులు ఈ సంపదను ఎలా సంపాదించారో ఈ నివేదిక స్పష్టంగా చూపిస్తుంది, అలాగే ఈ సమయంలో కోట్ల మంది ప్రజలు కష్ట సమయాలను ఎదురుకొన్నారు.' అని అన్నారు.
undefined
click me!