గత ఐదేళ్లలో గౌతమ్ అదానీ వీలైనన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టి తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. బొగ్గు గనుల నుంచి పోర్టులు, సిమెంట్, మీడియా, సిటీ గ్యాస్ పంపిణీ ఇలా అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టారు. అదానీ గ్రూప్ ప్రస్తుతం భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ ఓడరేవు మరియు విమానాశ్రయ నిర్వహణ సంస్థగా ఉంది.