వాస్తవానికి, ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ మొదటిసారిగా కోకా-కోలాను 1949లో భారతదేశంలో ప్రారంభించింది, భారతదేశంలో కోకాకోలా ఏకైక లైసెన్స్ కలిగిన తయారీదారు, పంపిణీదారుగా ప్యూర్ డ్రింక్స్ అవతరించింది. ఇక 1977 తర్వాత దాదాపు 15 ఏళ్ల పాటు ఢిల్లీలో క్యాంపా కోలా శీతల పానీయం మంచి సేల్స్ సాధించింది. కోకా కోలా బ్యాన్ తర్వాత ఈ క్యాంపా కోలా బ్రాండ్ తక్షణమే హిట్ అయింది. ఈ డ్రింక్ ను ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా 50కి పైగా ఫ్యాక్టరీల్లో తయారు చేసేవారు.