ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ మైన్
ఈ మైన్ నుండి గణనీయమైన మొత్తంలో బంగారం సేకరిస్తున్నారు. ఇండోనేషియాలోని ఈ మైన్ లో దాదాపు 20,000 మంది పనిచేస్తున్నారంటే ఇది ఎంత పెద్ద స్థాయిలో పని చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఈ మైన్ లో విమానాశ్రయం, పోర్టు ఉన్నాయి. ఇంకా నివాస సముదాయాలు, పాఠశాలలు, దాని ఉద్యోగుల కోసం ఆసుపత్రులు కూడా ఉన్నాయి.
2023లో మాత్రమే గ్రాస్ బెర్గ్ మైన్ 52.9 టన్నుల బంగారం, 680,000 టన్నుల రాగి, 190 టన్నుల వెండిని ఉత్పత్తి చేసింది. 1936లో డచ్ జియాలజిస్ట్ జీన్ జాక్స్ డోసి ఇక్కడ ఖనిజ నిక్షేపాలను కనుగొన్నారు. అప్పటి నుంచి ఇక్కడ బంగారం తవ్వకాలు జరుగుతున్నాయి.