మీరు చాలా రోజుల నుంచి బంగారం కొనాలని అనుకుంటున్నారా? అయిలే ప్రస్తుతం రేటు ఎక్కువగా ఉంది కదా.. కాస్త రేటు తగ్గాక బంగారం కొందామని ఆగిపోయారా? వెంటనే గాని మీరు బంగారం కొనకపోతే ఇప్పట్లో కొనలేరు. ఎందుకంటే త్వరలోనే బంగారం ధర రూ.లక్ష దాటుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మీరు గోల్డ్ కొనాలనుకుంటే ఇక ఆలస్యం చేయకుండా వెంటనే కొనడం మంచిది.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో జౌన్స్ బంగారం 3000 డాలర్లు పలుకుతోంది. ఇది ఇలాగే కొనసాగుతూ పెరుగుతూ పోతుందని, త్వరలో బంగారం రూ.లక్ష దాటుతుందని మార్కెట్ ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. గత కొంతకాలంలో బంగారం ధరలు కొంచెంకొంచెంగా పెరుగుతున్నాయి. కాని గత వారం రోజులుగా జెట్ స్పీడ్ గా పెరగడం జరిగింది. అందుకే గత రికార్డులు సైతం బద్దలు కొడుతూ రూ.90 వేల మార్కును దాటేసింది.
ఇది కూడా చదవండి రిస్క్ లేకుండా ఎక్కువ లాభాలు కావాలంటే బంగారంపై ఇన్వెస్ట్ చేయండి. ఇవిగో టిప్స్
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మార్చి 13న 10 గ్రాముల బంగారం ధర తొలిసారిగా రూ.90 వేల మార్కును దాటింది. అదేవిధంగా వెండి కూడా కిలో రూ.1.03 లక్షలకు చేరింది. మార్చి 14న 10 గ్రాముల బంగారం ధర రూ.90,450గా నమోదైంది. అలాగే కిలో వెండి రూ.1.14 లక్షలు పలికింది. అంతర్జాతీయ మార్కెట్ లో మార్చి 14న బంగారం తొలిసారిగా ఒక జౌన్స్ ధర రూ.3000 డాలర్లు పలికింది. దీన్ని బట్టి బంగారం ధరలు ఎలా రికార్డులు నెలకొల్పుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
బంగారం ధరలు పెరగడానికి కారణాలు
బంగారం ధరలు ఇలా రికార్డులు బద్దలుకొట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ప్రపంచ భౌగోళిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం, ఇంకా అనేక దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో కొన్ని దేశాలు బంగారం రూపంలో ఆర్థిక నిల్వలను ఉంచుకోవాలని చూస్తుండటంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనం కావడం కూడా బంగారం ధరలపైన ప్రభావం చూపుతోంది. వీటికి తోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు, ప్రకటనలు బంగారం ధరల పెరుగుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.
బంగారం ధర ఎప్పుడు తగ్గుతుంది
ప్రస్తుతం బంగారం పరుగులు చూస్తుంటే ఇప్పట్లో తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు. కాని ప్రపంచ వ్యాప్తంగా కొన్ని మారితే కచ్చితంగా అవి గోల్డ్ రేట్స్ పై ప్రభావం చూపుతాయి. అవేంటంటే... ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పతనం కావడంతో అందరూ బంగారం పై ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందుకే గోల్డ్ ఈటీఎఫ్ స్టాక్స్ కూడా పెరుగుతున్నాయి. అయితే స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాల్లోకి వస్తే పెట్టుబడిదారులు స్టాక్స్ పై పెట్టుబడి పెట్టొచ్చు. అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా డాలర్ విలువ పటిష్టంగా మారినా బంగారంపై పెట్టుబడులు తగ్గి ధరలు తగ్గుతాయి. ఇవన్నీ జరగాలంటే కనీసం మూడు నుంచి ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అది కూడా ప్రపంచ పరిస్థితులు మారకుండా ఉంటేనే బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. లేదంటే త్వరలోనే రూ.లక్ష దాటుతుందనడంలో సందేహం లేదు.