ఇప్పుడు ఇండియాలో బంగారం ధర ఒక్కసారిగా పెరిగింది. నిన్నటి వరకు 10 గ్రాముల బంగారం ధర రూ.88,100 గా ఉంది. ఇది ఒక్కసారిగా రూ.90,000లకు దగ్గరగా వచ్చేసింది. ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇక వెండి విషయానికొస్తే రికార్డు స్థాయిలో కిలో వెండి రూ.లక్షకు చేరుకుంది. వెండి ధరలు రూ.లక్షకు చేరడం ఇది తొలిసారి కాదు.