ఇలా బిజినెస్ స్టార్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం రూ.3 లక్షల వరకు రుణాన్ని ఇస్తుంది. దీన్ని రెండు విడతల్లో అంటే రూ.1 లక్ష, రూ.2 లక్షలుగా వివిధ దశల్లో ఇస్తుంది. ఈ రుణం పొందినందుకు గాను అభ్యర్థులు కట్టాల్సిన వడ్డీ కేవలం రూ.40 పైసలు మాత్రమే. దీంతో పాటు ప్రతి డిజిటల్ లావాదేవీపై రూ.1 వరకు ప్రయోజనం పొందవచ్చు. శిల్పకారుల ఉత్పత్తులకు బ్రాండింగ్, క్వాలిటీ సర్టిఫికేషన్, గెం వంటి ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్లలో చేరే అవకాశం కూడా కల్పిస్తారు.
మరిన్ని వివరాలు, నమోదు కోసం PM Vishwakarma యోజన వెబ్ సైట్ ను ఒకసారి చూడండి.