ఇప్పటి వరకు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి సబ్సిడీపై రేషన్ సరకులు పంపిణీ చేసేవారు. ఇప్పుడు రేషన్ కార్డుపై పూర్తి గోధుమలు పొందే కుటుంబాలకు అంటే జాతీయ ఆహార భద్రతా పథకం లబ్ధిదారుల కుటుంబాలు కూడా పండగల సీజన్ లో తక్కువకు గ్యాస్ సిలెండర్ పొందవచ్చన్న మాట. దీని కోసం వారు ప్రత్యేకంగా రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు నమోదు కార్యక్రమం చేయించుకోవాలి. దీని కోసం రేషన్ షాపు ద్వారా తమ LPG IDని లింక్ చేసుకోవాలి.
LPG సిలిండర్ సబ్సిడీ పథకం కింద జాతీయ ఆహార భద్రతా పథకం అర్హత కలిగిన కుటుంబాల LPG IDలను ఆధార్, రేషన్ కార్డులతో అందిస్తారు. ఇది నవంబర్ 5 నుండి నవంబర్ 30, 2024 వరకు అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. రేషన్ షాపులలో ఉన్న పిఓఎస్ మెషిన్ల ద్వారా అర్హులు వీటిని పొందవచ్చని తెలిపారు.