గత కొన్ని రోజులుగా రిటైర్మెంట్ వయసు పెరుగుతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇది పూర్తిగా అవాస్తవమని పీబీఐ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంచే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని వెల్లడించింది.
'రిటైర్మెంట్ వయసు పెంపు 2024, రిటైర్మెంట్ వయసు 2 సంవత్సరాలు పెంపు, కేబినెట్ సమావేశంలో ఆమోదం' అనే శీర్షికతో ఒక లేఖ వైరల్ అవుతోంది. ఈ పథకం పేరు 'రిటైర్మెంట్ వయస్సు పెంపు పథకం' అని కూడా ఆ పోస్ట్లో పేర్కొన్నారు. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు ఏప్రిల్ 1, 2025 నుంచి 2 సంవత్సరాలు పెంచి 62 ఏళ్లు చేస్తారని ఉంది. అందరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దీని ద్వారా ప్రయోజనం పొందుతారని కూడా అందులో పేర్కొన్నారు.