ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన పథకం కింద రూ. 2 లక్షల వరకు ప్రమాద బీమా లభిస్తుంది. దీనికి ప్రీమియం కూడా చాలా తక్కువ. అందరూ సులభంగా చెల్లించవచ్చు. ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి సంవత్సరానికి రూ. 20 మాత్రమే ప్రీమియంగా చెల్లిస్తే సరిపోతుంది.
భారతదేశంలోని అత్యధిక జనాభాకు భద్రతా బీమాను అందించడమే ఈ పథకం లక్ష్యం. గతంలో ఈ పథకం వార్షిక ప్రీమియం రూ. 12గా ఉండేది. ఇది జూన్ 1, 2022 నుండి రూ. 20కి పెంచారు. ధరలు, ఆదాయాలు పెరిగిన నేపథ్యంలో ఇది కూడా తక్కువ ప్రీమియం అనే చెప్పొచ్చు. కాబట్టి పేద ప్రజలు కూడా సులభంగా ఈ పాలసీ తీసుకోవచ్చు.