ఫలితాలు సూపర్బ్.. ప్రగతికి ఊతం.. మోదీపై కార్పొరేట్ల ప్రశంసల హోరు
First Published May 24, 2019, 3:37 PM ISTకేంద్రంలో సుస్థిరమైన పాలన అందించగలిగిన సమర్థత గల నేత ప్రధాని నరేంద్రమోదీ అని కార్పొరేట్ ప్రపంచం కొనియాడుతోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అద్భుతంగా ఉన్నాయని, ఇవి ప్రగతికి ఊతంగా పని చేస్తాయని పేర్కొంది. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే దేశాభివృద్ధికి ఊతం లభిస్తుందని, విదేశీ పెట్టుబడులు వెల్లువలా వస్తాయని కార్పొరేట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఇప్పుడు ఆ దిశగానే ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి సంపూర్ణ మెజార్టీతో పాలన పగ్గాలు చేపడుతుండటంపై పలువురు కార్పొరేట్లు హర్షం వ్యక్తం చేశారు.