కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, 1 జూలై 2021 నుండి ప్రభుత్వ ఉద్యోగులకు ఈ భత్యం లభిస్తుంది. ఈ భత్యం రేటును 17 శాతం నుంచి 28 శాతానికి పెంచారు. జూన్ 26న డిఓపిటి, ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వ సిబ్బంది ప్రతినిధి బృందం జెసిఎం నేషనల్ కౌన్సిల్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ సమావేశానికి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా అధ్యక్షత వహించారు.
undefined
డీఏ మొత్తంతో పాటు, 18 నెలల బకాయిలను కూడా విడుదల చేయాలని ప్రతినిధి బృందం కేబినెట్ కార్యదర్శిని అభ్యర్థించింది. దీనికి సంబంధించి తుది నివేదికను తయారు చేసి కేబినెట్ ఆమోదం కోసం పంపుతున్నామని కేబినెట్ కార్యదర్శి తరపున తెలిపారు. 'స్టాఫ్ సైడ్' నేషనల్ కౌన్సిల్ ఇంతకుముందు ఉద్యోగుల జీతభత్యాలు, రిటైర్డ్ ఉద్యోగులు డిఏ పొందడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖతో పలు సమావేశాలు నిర్వహించింది. జెసిఎం కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా, సభ్యుడు సి. శ్రీకుమార్ ప్రకారం అప్పటి ఆర్థిక మంత్రిత్వ శాఖలో రాష్ట్ర మంత్రిగా ఉన్న అనురాగ్ ఠాకూర్ ఉద్యోగులు తమ డిఎ మొత్తాన్ని పొందుతారని ప్రకటించారు.
undefined
గత 18 నెలలుగా ఒక కోటికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు డిఏ భత్యం, డిఆర్ కోసం ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా డియర్నెస్ అలవెన్స్ (డిఏ ), డియర్నెస్ రిలీఫ్(డిఆర్ ) జనవరి 2020 నుండి పెండింగ్ లో ఉంది. ఆ సమయంలో ఎల్టిసి వంటి ఇతర భత్యాలను కూడా నిషేధించారు. ఉద్యోగుల డిఎ 2020 మేలో 21 శాతంగా ఉంది తరువాత 1 జూలై 2021న 31 శాతానికి పెరిగింది. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు గడిచిన 18 నెలల్లో పదవీ విరమణ చేశారు అలాగే ఎంతో మంది వర్కర్లు, పెన్షనర్లు కన్నుమూశారు. డీఏ, డీఆర్లు లభించకపోవడం వల్ల వారు భారీగా ఆర్థిక నష్టాన్ని చవిచూశారు.
undefined
శివ గోపాల్ మిశ్రా ప్రకారం, డీఏ, డీఆర్ బకాయిలు కలిపి ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. బకాయిలు, ఇతర భత్యాలను ఒకేసారి విడుదల చేయడం సాధ్యం కాకపోతే, వాటిని తక్కువ వ్యవధిలో ఇవ్వాలి. కేబినెట్ కార్యదర్శికి 18 నెలల బకాయిల గురించి ఇప్పటికే తెలియజేసింది.డీఏ రేట్లు జనవరి 2020 నుంచి నవంబర్ 2020 వరకు 24 శాతానికి, 2020 డిసెంబర్ నుంచి మే 2021 వరకు 28 శాతానికి, జూన్ 2021 నుంచి జూలై 2021 వరకు 31 శాతానికి పెరిగాయి.
undefined