ఎందుకంటే ఎయిర్ ఇండియా ఇప్పుడు అంతర్జాతీయ ప్రయాణీకుల కోసం ప్రత్యేక ఆఫర్ను ప్రవేశపెట్టింది. యూకేతో సహా యూరప్లోని ఐదు నగరాలకు సెలెక్ట్ చేసిన రూట్లలో ఎయిర్ ఇండియా భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది.
మీ చేతిలో రూ.40,000 ఉంటే కోపెన్హాగన్ (డెన్మార్క్), లండన్ హీత్రో (యుకె), మిలన్ (ఇటలీ), పారిస్ (ఫ్రాన్స్), వియన్నా (ఆస్ట్రియా)లకు వెళ్లవచ్చని ఎయిర్ ఇండియా తెలిపింది. మీరు వన్ వే రూట్ సెలెక్ట్ చేసుకుంటే టికెట్ ధర రూ. 25,000 అని కంపెనీ అధికారిక ప్రకటనలో తెలిపింది.