Women scheme: పదో తరగతి పాస్ అయితే చాలు.. మీ అకౌంట్లోకి నెలకు రూ.7000!

Published : Feb 17, 2025, 03:26 PM IST

దేశవ్యాప్తంగా మహిళలకు మోదీ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ పథకం కింద వారి అకౌంట్లో నెల నెలా 7వేల రూపాయలు జమ కానున్నాయి. మరి మహిళలకు మేలు చేసే ఈ పథకం ఏంటీ? ఎలా అప్లై చేసుకోవాలి? అర్హులెవరు? ఇతర విషయాలు మీకోసం.

PREV
15
Women scheme: పదో తరగతి పాస్ అయితే చాలు.. మీ అకౌంట్లోకి నెలకు రూ.7000!

ప్రజా సంక్షేమానికి ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెడుతుంటాయి. మరీ ముఖ్యంగా మహిళల కోసం అనేక పథకాలు అమలులో ఉన్నాయి. వాటిలో ఒకటే బీమా సఖి యోజన. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఈ పథకం ద్వారా మహిళలకు నెలకు 7వేల రూపాయలు అందించనున్నారు. ఈ పథకం గురించి పూర్తి వివరాలు మీకోసం.

25
మహిళల ఆర్థిక అభివృద్ధి

మహిళలకు ఆర్థిక సాయం అందించే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకువచ్చారు. బీమా సఖి యోజన పథకాన్ని ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ద్వారా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మహిళలకు శిక్షణ, ఉద్యోగ అవకాశాలను కల్పించడంతో పాటు వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా కృషి చేస్తారు.

అర్హులెవరు?

మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు. పదో తరగతి పాసైన వాళ్ళు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు 18 నుంచి 70 ఏళ్ల మధ్యలో ఉండాలి.

35
దరఖాస్తు ఎలా?

బీమా సఖి యోజన పథకం మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకానికి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

45
కావాల్సిన డాక్యుమెంట్లు

1. వయసు ధ్రువీకరణ పత్రం
2. చిరునామా ధ్రువీకరణ పత్రం
3. పదో తరగతి మార్కుల ధ్రువీకరణ పత్రం
4. పాస్ పోర్టు సైజ్ ఫోటో

55
ఎల్ఐసి పథకం

ఈ పథకాన్ని ఎల్ఐసి నిర్వహిస్తోంది. మహిళలకు ఎల్ఐసీ ఏజెంట్లుగా ప్రత్యేక శిక్షణ, మొదటి మూడు సంవత్సరాలకు స్కాలర్‌షిప్ ఇస్తారు. స్కాలర్ షిప్ ఒక్కో ఏడాదికి ఒక్కో రకంగా ఉంటుంది. మహిళలు వార్షిక పనితీరు లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంటుంది. వారు అమ్మిన పాలసీల్లో 65శాతం వరకు కొనసాగాలి.

 

click me!

Recommended Stories