కేంద్ర ప్రభుత్వం ఈ నెలలోనే తమ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్(DA) మళ్లీ పెరగనుంది. DAతో పాటు, మోడీ ప్రభుత్వం ఇంటి అద్దె భత్యం, ప్రయాణ భత్యం, కొత్త వేతన సంఘం ఏర్పాటు, సీనియర్ సిటిజన్లకు రైలు ఛార్జీల్లో రాయితీ ఇవ్వడం వంటి అంశాలను కూడా పరిశీలిస్తోంది. దీంతో ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. జనాభాలోని వివిధ వర్గాలకు మరింత ఉపశమనం కలిగించడం, వారికి అండగా నిలవడమే ఈ చర్యల లక్ష్యమని తెలుస్తోంది.