మరోవైపు బంగారం ధర తగ్గాలంటే అమెరికాలో మొదలైన బ్యాంకింగ్ సంక్షోభానికి ముగింపు రావాల్సి ఉందని, అలాగే పశ్చిమ దేశాల్లో ఆర్థిక సంక్షోభం సర్దుమనిగితే నెమ్మదిగా బంగారం ధరలు కూడా భూమార్గం పడతాయని, భవిష్యత్తులో 50 వేల దిగువకు వచ్చే అవకాశం ఉందని నిపుణుల అంచనా వేస్తున్నారు. గతంలో 56 వేల రూపాయల గరిష్ట స్థాయిని తాకిన బంగారం ఆ తరువాత 48 వేల రూపాయలకు పతనమైంది. ఈ నేపథ్యంలో పసిడి ధర భవిష్యత్తులో 50వేల దిగువకు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.