జనవరి 31న ఆర్థిక సర్వే
బడ్జెట్ సమర్పించే ఒకరోజు ముందు అంటే జనవరి 31న కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ప్రవేశపెడుతుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆన్యువల్ డాక్యుమెంట్, ఫైనాన్షియల్ సర్వే గత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక అభివృద్ధిని సమీక్షిస్తుంది. అంటే పారిశ్రామిక, వ్యవసాయం, తయారీ తదితర అన్ని రంగాలకు సంబంధించిన పూర్తి వివరాలను అందిస్తుంది. విశేషమేమిటంటే, భారతదేశంలో మొదటి ఆర్థిక సర్వే 1950-51 సంవత్సరంలో సమర్పించారు. 1964 నాటికి బడ్జెట్, ఆర్థిక సర్వే ఒకేసారి సమర్పించబడ్డాయి. ఆ తరువాత విడిగా ప్రవేశపెట్టారు.