Jio, Airtel, Viలు భారత టెలికాం రంగంలో మూడు ప్రధాన కంపెనీలు. అయితే ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ BSNL గత కొన్ని నెలలుగా ప్రైవేట్ కంపెనీలకు గట్టి పోటీనిస్తోంది. ప్రైవేట్ కంపెనీల కస్టమర్ల సంఖ్య తగ్గుతుండగా BSNL కస్టమర్ల సంఖ్య లక్షల్లో పెరుగుతోంది.
BSNL, మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్(MTNL)ల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం రూ. 3.22 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ ప్యాకేజీల కారణంగా BSNL, MTNL FY 2021 నుండి నిర్వహణ లాభాలను ఆర్జించడం ప్రారంభించాయి. ప్రస్తుతం BSNL 4G సేవలను వేగంగా అందించడానికి పనిచేస్తోంది.