రూ.2,999 మీకు తక్కువ ధరా? అని మీరు అడగవచ్చు. ఇదే విధమైన ఒక సంవత్సరానికి ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా వంటి కంపెనీలు రూ.3,500 కంటే ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాయి.
బిఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టిన ఈ రూ.2,999 ప్లాన్లో రోజువారీ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్, ఉచిత SMS కాకుండా వేరే ఎలాంటి ఆఫర్ను ప్రకటించలేదు. ఒక సంవత్సరానికి రీఛార్జ్ సేవను ఉపయోగించేవారికి ఇది ఒక వరం లాంటి ప్లాన్. కొత్త సంవత్సరం రాబోతున్న నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్ ఈ ప్రీపెయిడ్ ప్లాన్ను రీఛార్జ్ చేసి మీరు ఏడాది పొడవునా ఆనందించవచ్చు.