స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇన్ఫోసిస్ అందించిన సమాచారం ప్రకారం, సెప్టెంబర్ చివరి నాటికి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షత 3.89 కోట్లు లేదా 0.93 శాతం ఇన్ఫోసిస్ షేర్లను కలిగి ఉన్నారు. మంగళవారం బిఎస్ఇలో ఒక్కో షేరు ధర రూ.1,527.40 చొప్పున ఆమె వాటా విలువ రూ.5,956 కోట్లు. భారతదేశంలో డివిడెండ్ చెల్లించే అత్యుత్తమ కంపెనీలలో ఇన్ఫోసిస్ ఒకటి కావడం విశేషం.