ఇతర వస్త్రాలపై (నేసిన బట్టలు, సింథటిక్ నూలులు, పైల్ ఫ్యాబ్రిక్స్, బ్లాంకెట్లు, టెంట్లు, టేబుల్ క్లాత్లు వంటి ఇతర వస్త్రాలు)పై కూడా జీఎస్టీ రేటును 5 శాతం నుంచి 12 శాతానికి పెంచారు. అదనంగా ఏదైనా విలువగల పాదరక్షలపై వర్తించే జిఎస్టి రేటు కూడా 12 శాతానికి పెంచింది. దీనిపై నవంబర్ 19న భారత దుస్తుల తయారీదారుల సంఘం (సీఎంఏఐ) వ్యాఖ్యానిస్తూ దుస్తులపై జీఎస్టీని పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా నిరాశాజనకంగా ఉందన్నారు.