ముకేశ్ అంబానీ ఇప్పటికే తన వ్యాపార సామ్రాజ్యానికి సంబంధించిన వివిధ బాధ్యతలను ముగ్గురు పిల్లలకు పంచారు. గత కొన్ని సంవత్సరాలుగా ముగ్గురు పిల్లలు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రధాన వ్యాపారాలకు కూడా నాయకత్వం వహిస్తున్నారు. కంపెనీ 46వ అన్యువల్ జనరల్ సమావేశంలో ముఖేష్ అంబానీ తన పిల్లలకు వివిధ వ్యాపారాల పంపకం గురించి సమాచారం ఇచ్చారు.
తన ముగ్గురు పిల్లలు ఇషా, ఆకాష్ అండ్ అనంత్ అంబానీ సంస్థ వివిధ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తారని ముకేశ్ విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే, 66 ఏళ్ల ముకేశ్ అంబానీ RIL చీఫ్గా రాబోయే 5 సంవత్సరాలు Jio, రిటైల్ అండ్ కొత్త ఇంధన పరిశ్రమలను సమర్ధవంతంగా నిర్వహించడానికి తగిన మార్గదర్శకత్వం అందిస్తానని చెప్పారు.