Cyber Fraud: ఈ 4 సెట్టింగ్స్ మార్చకపోతే మీరు ఫోన్ డేంజర్‌లో ఉన్నట్టే!

Naga Surya Phani Kumar | Published : Mar 18, 2025 11:21 AM
Google News Follow Us

Cyber Fraud: ఈ కాలంలో సైబర్ నేరాలు ఎంతలా పెరిగాయంటే.. మనకు తెలియకుండా మన అకౌంట్లు ఖాళీ చేసేస్తున్నారు. ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు. ఓటీపీలు అవసరం లేకుండానే బ్యాంకు అకౌంట్స్ హ్యాక్ చేస్తున్నారు. మీ ప్రైవేట్ డేటా, బ్యాంకు అకౌంట్స్ సేఫ్ గా ఉండాలంటే అర్జెంట్ గా ఈ 4 సెట్టింగులు మార్చుకోండి. 
 

14
Cyber Fraud: ఈ 4 సెట్టింగ్స్ మార్చకపోతే మీరు ఫోన్ డేంజర్‌లో ఉన్నట్టే!

సైబర్ నేరాలపై అవగాహన ఉన్న వారు ఫ్రాడ్ కాల్స్, మెసేజ్ ల నుంచి జాగ్రత్తగానే ఉంటారు. ఎందుకంటే చాలా ట్రాన్సాక్షన్స్ ఓటీపీల ద్వారానే జరుగుతాయి. అందుకే ఓటీపీలు ఎవరికీ షేర్ చేయకుండా ఉంటే సేఫ్ అనుకుంటారు. అయితే హ్యాకర్లు తలచుకుంటే మీ ఫోన్ వచ్చిన ఓటీపీలు, మెసేజ్ లు కూడా చూడగలరు. 

ఇలా జరగకుండా ఉండాలంటే మీ ఫోన్ లో Lock Screen Notifications ఆఫ్ చేయండి. 

మీ ఫోన్ లో Settings ఓపెన్ చేయండి.
Notifications లోకి వెళ్లండి.
Lock Screen Notifications ఆప్షన్ పై క్లిక్ చేసి ఆఫ్ చేయండి. 

24

మీ ఫోన్ దొంగతనం జరిగినా స్విచ్ ఆఫ్ కాకుండా ఉండాలంటే..

ఫోన్ ను ఎవరైనా దొంగతనం చేస్తే వెంటనే పవర్ ఆఫ్ చేస్తారు కదా.. అలా చేస్తేనే కాల్స్ రాకుండా ఉంటాయి. సిగ్నల్స్ ట్రాక్ చేయడానికి వీలుండదు. అందుకే దొంగలు ఫోన్ దొంగిలించిన వెంటనే స్విచ్ ఆఫ్ చేస్తారు. మీ ఫోన్ ఎవరైనా దొంగిలించినా పవర్ ఆఫ్ చేయకుండా ఉండాలంటే వెంటనే ఈ సెట్టింగ్ మార్చుకోండి. 

మీ ఫోన్ లో Settings ఓపెన్ చేయండి.
అందులో Security ఆప్షన్ లోకి వెళ్లండి.
require password to power off ఆప్షన్ పై క్లిక్ చేసి Enable చేయండి.

34

దొంగతనం జరిగిన మీ ఫోన్ స్విచ్ఛాఫ్ అయినా ట్రాక్ చేయొచ్చు

ఇది చాలా మంది దొంగలకు కూడా తెలియని టెక్నిక్. సాధారణంగా ఫోన్ దొంగతనం చేసిన వెంటనే దొంగలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తారు. దీంతో కాల్స్ రావు, నెట్వర్క్ ను కూడా ట్రాక్ చేయలేరని అనుకుంటారు. కాని ఫోన్ స్విచ్చాఫ్ అయినా మీ ఫోన్ ఎక్కడుందో కనిపెట్టాలంటే ఈ సెట్టింగ్ ఆన్ చేసి పెట్టుకోండి. 

మీ ఫోన్ లో Settings ఓపెన్ చేయండి.
అందులో Google ఆప్షన్ లోకి వెళ్లండి.
Find My Deviceపై క్లిక్ చేసి With network in high traffic areas only అనే సెట్టింగ్ ను ఆన్ చేయండి. దీంతో మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా ట్రాక్ చేయొచ్చు. 

Related Articles

44

USB ద్వారా మీ డేటా యాక్సెస్ చేయకుండా..

ఎప్పుడైనా మన ఫోన్ పాడైనప్పుడు రిపేర్ కి ఇస్తే కొందరు మన డేటాను దొంగిలించడానికి చూస్తారు. అలా జరగకుండా ఉండాలంటే ఈ సెట్టింగ్ మార్చండి.

మీ ఫోన్ లో Settings ఓపెన్ చేయండి.
అందులో Developer Options పై క్లిక్ చేయండి.
తర్వాత USB Debugging ఆప్షన్ ను ఆఫ్ చేయండి.
ఇలా చేస్తే మీ USB పోర్ట్ ద్వారా హ్యాకర్స్ మీ డేటాను యాక్సెస్ చేయలేరు.  

ఇది కూడా చదవండి జీమెయిల్‌ స్టోరేజ్ నిండిపోయిందా? ఇలా చేస్తే అవసరం లేని మెయిల్స్ ఒకేసారి డిలీట్ అయిపోతాయి

Recommended Photos