డిజిటల్ అగ్రికల్చర్ మిషన్..
డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ (Digital Agriculture Mission) కేంద్ర ప్రభుత్వం 2021-2025 కాలంలో వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించేందుకు రూపొందించిన పథకం. వ్యవసాయంలో డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం, డేటా ఆధారిత నిర్ణయాలు, సుస్థిరతను ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యాలు. ఈ పథకం కోసం కేంద్రం రూ. 2817 కోట్లు ప్రకటించింది.
ఈ పథకం ద్వారా వ్యవసాయంలో డిజిటల్ టూల్స్ (IoT, AI, డ్రోన్స్, GIS) డేటా ఆధారిత వ్యవస్థలను కేంద్రం ప్రవేశపెడుతుంది. రైతులు డిజిటల్ పద్ధతులను వాడటం ద్వారా వారి పని పద్ధతులను మెరుగుపరచుకోవచ్చు. వ్యవసాయ నిధులు, సబ్సిడీలు ఉపయోగించుకొని రైతులు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవచ్చు.
వ్యవసాయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సాయంతో పంటల విస్తరణ, సస్యరక్షణ, నీటి వినియోగం, ఎరువుల వినియోగాన్ని పెంచేలా ఈ పథకం రూపొందించారు. ఈ పథకం ద్వారా ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థలు కలిసి డిజిటల్ టెక్నాలజీని ప్రవేశపెట్టి, రైతులకు సేవలు అందిస్తాయి.