10th పాసైతే చాలు: 35 వేల రూపాయల జీతం వచ్చే గవర్నమెంట్ జాబ్ మీకోసం

First Published Oct 9, 2024, 11:26 AM IST

మీకు టెన్త్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. 35 వేల రూపాయల జీతం వచ్చే జాబ్ మీకోసం సిద్ధంగా ఉంది. ఈ జాబ్ కి అప్లై చేయడానికి మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ఆన్ లైన్ లోనే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ ఏమిటి? ఎక్కడ వర్క్ చేయాలి? ఎలా అప్లై చేయాలి వంటి మరిన్ని వివరాలకు ఈ కథనం పూర్తిగా చదవండి. 
 

ఈ కాలంలో ఇంజినీరింగ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా జాబ్స్ వస్తాయన్న గ్యారెంటీ లేకుండా ఉంది. పెద్ద చదువు చదివినా సరే చదువు పూర్తయ్యే సరికి ఏ జాబ్ దొరికితే అదే చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అనుకున్న జాబ్ రావాలంటే సంవత్సరాల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. అనుకున్నంత సాలరీ రాకపోయినా కుటుంబ అవసరాల కోసం వచ్చిన జాబ్ చేస్తూ చాలీచాలని జీతంతో జీవితం కొనసాగించాల్సి వస్తోంది. అయితే మీరు టెన్త్ పూర్తి చేస్తే చాలు. సెంట్రల్ గవర్నమెంట్, ఆర్బీఐ పర్యవేక్షణలో పనిచేసే నాబార్డ్ సంస్థ మీ కోసం చక్కటి జాబ్ అవకాశం ఇచ్చింది. 
 

నాబార్డ్(NATIONAL BANK FOR AGRICULTURE AND RURAL DEVELOPMENT)భారత దేశంలో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగంలో ప్రజలను ప్రోత్సాహించేందుకు ఏర్పాటుచేసిన సంస్థ. ఇది స్వతంత్రంగా పనిచేసే సంస్థ. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటుంది. నాబార్డ్ నిర్వహణ, నియంత్రణ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆర్బీఐ(RBI) పర్యవేక్షిస్తుంది.  

Latest Videos


NABARDలో ఆఫీస్ అటెండెంట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి 108 పోస్టులు రిక్రూట్ చేయనున్నారు. దీనికి క్వాలిఫికేషన్ 10th పాస్ అయితే చాలు. ఈ జాబ్స్ కు మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కు అప్లై చేయడానికి మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్ లైన్ లోనే వీటికి అప్లై చేసుకోవచ్చు. 
 

ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకుంటే మీకు 18 ఏళ్లు నిండి ఉండాలి. సాలరీ వచ్చేసి నెలకు రూ.35 వేల వరకు ఇస్తారు. ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలనుకుంటే అక్టోబర్ 21 లోపు మీరు దరఖాస్తు చేయాలి. అక్టోబర్ 02 నుంచే ఆన్ లైన్ లో అప్లికేషన్స్ ప్రాసెస్ ప్రారంభమైంది. www.nabard.org. వెబ్ సైట్ లోకి వెళ్లి ఆఫీస్ అటెండెంట్ అప్లికేషన్ ఓపెన్ చేసి మీ వివరాలు పూర్తి చేసి సెండ్ చేస్తే సరిపోతుంది. ఆన్ లైన్ ఎక్జామ్ నవంబర్ 21-2024లో ఉంటుంది. 
    
ఆన్ లైన్ లోనే టెస్ట్ పెట్టడం ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. ఇందులో రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీలపై మొత్తం 120 మార్కులకు పరీక్ష ఉంటుంది. తర్వాత లాంగ్వేజ్ ప్రొఫెసియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో అభ్యర్థులు తెలుగు భాషపై పరీక్ష రాయాల్సి ఉంటుంది. మీ ఇందులో నాబార్డ్ ఎస్టిమేషన్స్ ను మీరు రీచ్ చేయగలిగితే తర్వాత ఇంటర్వూ నిర్వహిస్తారు. అందులో కూడా నాబార్డ్ నిబంధనలకు అనుగుణంగా మీరు పర్ఫామ్ చేయగలిగితే మీకు ఆఫీస్ అటెండెంట్ జాబ్ వచ్చినట్టే. 

click me!