Royal Enfield:మేలో భారీగా పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు.. క్లాసిక్ 350, మెటోర్ అదుర్స్..

First Published Jun 2, 2022, 7:18 PM IST

మే నెలలో మొత్తం 63,643 బైకులను రీటైల్ చేసినట్లు ద్విచక్ర వాహన తయారీ సంస్థ  రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇటీవల ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే నెలలో కంపెనీ 27,294 బైకులను విక్రయించగలిగిన కంపెనీ పనితీరు కంటే ఇది  చాలా ఎక్కువ. అయితే గత ఏడాది కరోనా ప్రభావంతో పోలిస్తే  దాదాపు 133 శాతం ఎక్కువ. 

పెర్ఫామెన్స్ బైక్‌లను తయారు చేయడంలో పేరుగాంచిన రాయల్ ఎన్‌ఫీల్డ్ విదేశీ మార్కెట్‌లలో అత్యధికంగా 10,118 బైకులను విక్రయించగలిగినట్లు తెలిపింది. దీని కారణంగా మొత్తం అంతర్జాతీయ వార్షిక అమ్మకాల వృద్ధి 40 శాతానికి మించిపోయింది. ప్రతి నెల వృద్ధి పరంగా కూడా ఏప్రిల్ 2022లో కంపెనీ సానుకూల వృద్ధిని నమోదు చేసుకోగలిగింది. 

YTY పనితీరును పరిగణనలోకి తీసుకుంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ 1,25,798 బైక్‌లను రిటైల్ చేయడం ద్వారా మొత్తం 56 శాతం వృద్ధిని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయించిన 80,592 యూనిట్ల కంటే ఇది చాలా ఎక్కువ. 
 

క్లాసిక్ 350 ఇండియన్ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్  అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. ఈ బైక్ 2021లో కొత్త జనరేషన్ అప్ డేట్ కూడా పొందింది.  రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇటీవల క్లాసిక్ 350, మీటోర్ 350 బైకులను కూడా మలేషియా మార్కెట్లో విడుదల చేసింది. 
 

కొన్ని వారాల క్రితం బెంగళూరులో 'టోర్నడో వాల్' అనే ప్రత్యేక స్మారక శిల్పంతో భారత సైన్యంతో సుదీర్ఘ అనుబంధాన్ని జరుపుకోవాలని కంపెనీ ప్రకటించింది. అంతేకాకుండా ఈ సంవత్సరం ప్రారంభంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈఓగా బి గోవిందరాజన్‌ను నియమిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
 

click me!