ఈ ఏడాది ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లు ఇవే: వాటి గురించి ప్రతీది తెలుసుకోండి

First Published May 17, 2021, 3:51 PM IST

వాతావరణంలో కాలుష్యం, పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుతుంది. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో  టాటా నెక్సాన్ ఈ‌వి ఏప్రిల్ 2021 నెలలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ వాహనంగా నిలిచింది. 

అలాగే గత నెలలో నెక్సాన్ ఇ.వి 500 పైగా యూనిట్లను విక్రయించడంలో కంపెనీ విజయవంతమైంది. అలాగే ఒక్క నెలలోనే ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో మొత్తం 749 యూనిట్లు అమ్ముడయ్యాయని తెలిపింది. ఇందులో టాటా నెక్సాన్ ఈ‌వికి మార్కెట్లో పెద్ద వాటా ఉంది.
undefined
ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో ఎం‌జి(మోరిస్ గ్యారేజ్) జెడ్‌ఎస్ ఈ‌వి రెండవ స్థానంలో ఉంది. గత నెలలో ఈ కారు 156 యూనిట్లు అమ్ముడయ్యాయి, ఇది చాలా తక్కువ.
undefined
టాటా టైగర్ ఇ.వి ఏప్రిల్ నెలలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల జాబితాలో మూడవ స్థానంలో ఉంది. టాటా టైగర్ ఇ.వి ఇప్పటివరకు 56 యూనిట్లను మాత్రమే విక్రయించారు.
undefined
ఈ జాబితాలో హ్యుందాయ్ కోనా ఇ.వి నాల్గవ స్థానంలో ఉంది. ఏప్రిల్ నెలలో కంపెనీ కోనా ఈ‌వి 12 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది.
undefined
టాటా మోటార్స్ ఈ ఏడాది ప్రారంభంలో నెక్సాన్ ఇవి ప్రారంభించినప్పటి 4,000 యూనిట్ల అమ్మకాల మైలురాయిని అధిగమించిందని ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ వాహనం నెక్సాన్ ఇ.వి
undefined
అంతే కాకుండా టాటా మోటార్స్ మే 2021లో ఎంపిక చేసిన కార్ల కొనుగోలుపై రూ .65,000 వరకు బెనెఫిట్స్ అందిస్తోంది. అంతేకాకుండా నెక్సాన్ ఈవీ కొనుగోలుపై రూ .15 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ ని కంపెనీ అందిస్తోంది. టాటా నెక్సాన్ డీజిల్ వేరియంట్లపై కూడా బెనెఫిట్స్ ఉన్నాయి.
undefined
click me!