ఈ రాశివారికి శత్రువులు ఎక్కువ..!

First Published Sep 4, 2021, 1:36 PM IST

ఈ కింద ఐదు రాశులవారు అంతే.. ఎదుటివారు చేసిన తప్పును అస్సలు మర్చిపోరు. వీరు మరచిపోవడం  చాలా అరుదు. ఎదుటివారిని క్షమించడం కూడా చాలా అరుదు అనే చెప్పాలి. ఆ రాశులేంటో ఇప్పుడు చూద్దాం..
 

జీవితంలో మనిషి అన్నాక.. తప్పులు, పొరపాట్లు చేయడం చాలా సహజం. అయితే.. వారు  చేసిన తప్పులను కొందరు వెంటనే క్షమించేస్తారు.కానీ కొందరు మాత్రం అస్సలు క్షమించరు. వారు చేసిన తప్పులను మనసులోనే ఉంచుకొని.. వారిని శత్రువులుగా మార్చుకుంటారు.
 

ఈ కింద ఐదు రాశులవారు అంతే.. ఎదుటివారు చేసిన తప్పును అస్సలు మర్చిపోరు. వీరు మరచిపోవడం  చాలా అరుదు. ఎదుటివారిని క్షమించడం కూడా చాలా అరుదు అనే చెప్పాలి. ఆ రాశులేంటో ఇప్పుడు చూద్దాం..
 

astrology

1.మేష రాశి..

ఈ రాశివారు తమ చుట్టూ ఉన్నవారు చేసే చిన్న తప్పులను కూడా పెద్దవిగా చూస్తుంటారు. దీని వల్ల వీరికి సాధారణంగానే శత్రువులు పెరిగిపోతారు.  అనవరసరంగా ఇతరులను  చూసి అసూయపడుతుంటారు. వారు తప్పులను ఎత్తి చూపడం వల్ల.. వారికి అందరూ దూరమైపోతూ ఉంటారు.  అందరికన్నా తాము స్ట్రాంగ్ అని ఫీలౌతూ ఉంటారు.
 

2.కర్కాటక రాశి..
ఈ రాశివారు ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తారు. ఒక వైపు చాలా ఎమోషనల్ గా ఉంటారు. మరోవైపు అందరిపై పెత్తనాన్ని  చలాయిస్తూ ఉంటారు. ఒక్కోసారి పెత్తనం చేస్తూ.. పైశాచిక ఆనందాన్ని కూడా పొందుతారు. ఈ క్రమంలో వీరు అందరికీ శత్రువులుగా మారుతుంటారు.

3.సింహ రాశి..

ఈ రాశివారు తమను మోసం , ద్రోహం చేసిన వారిని తొందరగా మర్చిపోరు. క్షమించరు. వారిపై పగ పెంచుకుంటారు. ఈ క్రమంలో వారిపై శత్రుత్వాన్ని పెంచుకుంటారు.

4.ధనస్సు రాశి..
ఈ రాశివారిలో చాలా మందికి దుర్మార్గపు ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అబద్దాలు చెబుతుంటారు. ఎక్కువగా ఎదుటివారిపై ద్వేషం పెంచుకుంటారు. ఎదుటివారిని నాశనం చేయాలని అనుకుంటారు. కానీ చివరకు వారి జీవితాన్ని నాశనం చేసుకుంటారు.
 

5.మకర రాశి..
మకర రాశివారికి శత్రువులు ఎక్కువగా ఉంటాయి. వీరు తమ చుట్టూ ఉన్నవారి ప్రలోభానికి గురౌతూ ఉంటారు. నచ్చనివారి పట్ల ద్వేషాన్ని పెంచుకుంటారు. ప్రేమగా ఉన్నంత వరకు బాగానే ఉంటారు. ఒక్కసారి కోపం వస్తే మాత్రం ధ్వేషం పెంచుకుంటారు. 

click me!