మేషరాశి: కాలభైరవ జయంతి నాడు మేషరాశి వారు ఉదయాన్నే స్నానం చేసి ధ్యానం చేసి శివుడికి పూజ చేయాలి. పూజా సమయంలో గంగా నీటిలో తేనె, సుగంధం కలిపి శివుడికి అభిషేకం చేయాలి. ఈ పరిహారం చేయడం వల్ల మంగళదోశం తొలగిపోతుంది.
వృషభ రాశి: ఈ రాశివారు కాలాష్టమి తిథి నాడు శివుడిని పూజించడం వల్ల ఆశించిన ఫలితాలను పొందుతారు. వీళ్లు ఈ రోజు శివుడికి పచ్చి పాలతో అభిషేకం చేయాలి.
మిథునరాశి: అశుభ గ్రహాల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి అలాగే జాతకంలో బుధ గ్రహాన్ని బలోపేతం చేయడానికి మిథున రాశి వారు గంగా నీటిలో దుర్వ, బిల్వపత్రాన్ని కలిపి శివుడికి అభిషేకం చేయాలి.