చంద్రబాబు ఝలక్: బాలకృష్ణ చిన్నల్లుడికి ఆశాభంగం

First Published Mar 5, 2019, 8:16 PM IST

విశాఖపట్నం: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభ్యర్థుల ఎంపికపై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. గెలుపు గుర్రాలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. దీంతో ఏపీలో రాజకీయ సమీకరణాల్లో అనూహ్యంగా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. 
 

విశాఖపట్నం: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభ్యర్థుల ఎంపికపై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. గెలుపు గుర్రాలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. దీంతో ఏపీలో రాజకీయ సమీకరణాల్లో అనూహ్యంగా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి.
undefined
గెలుపు గుర్రాలే టార్గెట్ గా ప్రణాళిక రచిస్తున్న చంద్రబాబు అభ్యర్థుల ఎంపికలో నిర్మోహమాటంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా వియ్యంకుడు, సినీనటుడు బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు నిర్మోహమాటంగానే వ్యవహరించారని తెలుస్తోంది.
undefined
శ్రీభరత్ విశాఖపట్నం టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది. దాంతో బాలయ్య చిన్నల్లుడు భరత్ భరత్ అనే నేను సినిమాలో డైలాగ్ కూడా ప్రిపేర్ అయిపోయారట. పార్లమెంట్ లో భరత్ అనే నేను అంటూ ప్రమాణం చేద్దామనుకుని ఆశల్లో ఉన్న ఆయనకు చంద్రబాబు నాయుడు ఊహించని షాక్ ఇచ్చారు.
undefined
భరత్ కు టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పేశారని తెలుస్తోంది. శ్రీభరత్ సినీనటుడు బాలయ్యకు చిన్నల్లుడే కాదు మాజీ ఎంపీ, దివంగత ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి రాజకీయ వారసుడు. తన తాతయ్య ఎంవీవీఎస్ మూర్తి చనిపోవడంతో ఆయన రాజకీయ వారసుడిగా రాజకీయ ఆరంగేట్రం చేశారు శ్రీ భరత్.
undefined
ఎంవీవీఎస్ మూర్తి చనిపోయే సమయానికి టీడీపీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. విశాఖపట్నం స్థానిక సంస్థల కోటాలో 2015లో ఎమ్మెల్సీ అయ్యారు. ఆనాటి నుంచి ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఆయన మరణానంతరం మనవడు, బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ కు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని అంతా ప్రచారం జరిగింది.
undefined
కానీ చంద్రబాబు మాత్రం అవకాశం ఇవ్వలేదు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో బుద్దా నాగజగదీశ్వర్ కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి శ్రీభరత్ కు హ్యాండిచ్చారు చంద్రబాబు నాయుడు. ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడంతో రాబోయే రోజుల్లో పెద్ద పదవే కట్టబెడతారంటూ అంతా ప్రచారం జరిగింది.
undefined
అయితే కొద్ది రోజులుగా విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీభరత్ పోటీ చేస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం శ్రీభరత్ కు టికెట్ ఇచ్చే చాన్స్ లేదని చెప్పేశారట. రాజకీయ అనుభవం లేకపోవడం, సామాజిక సమీకరణాల నేపథ్యంలో వేరొకరికి టికెట్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగుల వేస్తున్నారట.
undefined
శ్రీ భరత్ బరిలోకి దిగితే కేవలం కమ్మ సామాజిక వర్గం మాత్రమే ఆదరిస్తాదని మిగిలిన వర్గాలు అంతగా కలిసి రావని చంద్రబాబు భావిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ముళ్లపూడి సత్యనారాయణ అనే వ్యక్తిని బరిలోకి దించుతుంది.
undefined
ముళ్లపూడి సత్యనారాయణ గత కొంతకాలంగా విశాఖపార్లమెంట్ పరిధిలో మంచి పట్టు సాధించారు. స్థానిక నేతలతో మంచి సంబంధాలు పెట్టుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీభరత్ ను బరిలోకి దించితే ముళ్లపూడి సత్యనారాయణకే విజయవకాశాలు ఎక్కువగా ఉంటాయని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారట.
undefined
ముళ్లపూడి సత్యనారాయణకు ఉన్న పరిచయాలు, పెద్దరికం దృష్ట్యా ఆయనకే ఓట్లు ఎక్కువగా పడే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి గంటా శ్రీనివాసరావును తెరపైకి తీసుకువచ్చారు చంద్రబాబు. గంటా శ్రీనివాసరావు విశాఖ పార్లమెంట్ పరిధిలోని భీమిలి నియోజకవర్గం నుంచి గెలుపొందారు.
undefined
గతంలో ఆయన అనకాపల్లి ఎంపీగా కూడా గెలుపొందారు. గంటా శ్రీనివాసరావును బరిలోకి దించితే టీడీపీ ఓట్లతోపాటు కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా కొల్లగొట్టువచ్చని చంద్రబాబు ప్లాన్ వేస్తున్నారు. గంటా శ్రీనివాసరావు ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన దాఖలాలు లేవు.
undefined
ఆయన ఎన్నికల్లో పోటీ చేసే ప్రతీసారి నియోజకవర్గం మార్చడం ఆయనకు ఓ అలవాటుగా మారింది. ఇకపోతే గంటాను భీమిలి నియోజకవర్గం నుంచి తప్పిస్తారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. గంటాను విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా లేదా అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దించుతారని అందులో ఎలాంటి సందేహం లేదని తెలుస్తోంది.
undefined
మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సైతం భీమిలి నుంచి పోటీ చెయ్యాలని చూస్తున్నారట. భీమిలి నియోజకవర్గం నుంచి గెలిస్తే విజయం తథ్యమని భావిస్తున్నారట. భీమిలి నుంచి లోకేష్ పోటీ చేస్తారన్న వార్తలపై ఇటీవలే మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు.
undefined
తాను భీమిలి నియోజకవర్గం టికెట్ అడిగానని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు ఎక్కడ పోటీ చెయ్యమంటే అక్కడ పోటీ చేస్తానని ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే పార్టీకి సేవలందిస్తానని గంటా ప్రకటించారు. తన పోటీ విషయం అంతా చంద్రబాబు చేతుల్లోనే అంటూ బంతిని చంద్రబాబు కోర్టులో వేసి తప్పించుకున్నారు. గంటా వ్యాఖ్యలు పరోక్షంగా లోకేష్ పోటీకి మద్దతు ఇవ్వడమేనని చర్చ కూడా జరుగుతోంది.
undefined
ఇప్పుడే తన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పి ఇంతలోనే మాట మారిస్తే ఎలా అని చంద్రబాబు కదిరి బాబూరావుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో కదిరి బాబూరావు సమావేశం నుంచి అలిగి వచ్చేశారట. పార్టీ అధిష్టానంపై నానా దూషణలకు దిగారట.
undefined
ఇకపోతే శ్రీభరత్ సీఎం చంద్రబాబు నాయుడు తీరుపై గుర్రుగా ఉన్నారట. ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు సరికదా ఎంపీ టికెట్ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. తెలుగుదేశం పార్టీలో టిక్ పెట్టేది చంద్రబాబు నాయుడు అయినా నిర్ణయాధికారం తోడల్లుడు నారా లోకేష్ అని అక్కడ నుంచి అయినా నరుక్కుని వద్దామా అన్న కోణంలో శ్రీభరత్ ఆలోచిస్తున్నారట.
undefined
బాలకృష్ణ చిన్న అల్లుడు భవితవ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. స్థానిక సంస్థల కోటాలో అయిన ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఉండాల్సిందని సన్నిహితుల వద్ద అన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెద్ద అల్లుడు లోకేష్ తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు.
undefined
తాను పోటీ చేస్తున్నాను. చిన్న అల్లుడు కూడా అంటే కుటుంబంలో అందరికీ టికెట్లు ఇచ్చుకున్నారనే అపవాదు వస్తుందని అందుకే చంద్రబాబు టికెట్ ఇవ్వలేదని సర్దిచెప్పే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. మెుత్తం శ్రీభరత్ వ్యవహారం బాలయ్య, చంద్రబాబు కుటుంబంలో సరికొత్త చర్చకు దారి తీసిందని తెలుస్తోంది.
undefined
click me!