వైఎస్ఆర్ సంస్మరణ సభకు విజయమ్మ ఆహ్వానం: ఏపీ, తెలంగాణ నేతల తర్జన భర్జన

First Published Aug 31, 2021, 10:50 AM IST

మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నిర్వహించే  ఆత్మీయ సమ్మేళం సమావేశానికి హాజరు కావాలా వద్దా అనే విషయమై పలువురు నేతలు  తర్జనభర్జనలు పడుతున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనాన్ని విజయమ్మ హైద్రాబాద్ లో నిర్వహిస్తున్నారు.

ఎంత మంది ఉన్నా కూడ రాఘవరెడ్డి వచ్చినట్టుగా సమాచారం అందిస్తే ఐదు నిమిషాల్లో వైఎస్ఆర్ రాఘవరెడ్డిని కలిసేవాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాఘవరెడ్డి టీఆర్ఎస్ లో చేరారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్ర మాజీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి  సెప్టెంబర్ 2వ తేదీన నిర్వహిస్తున్న వైఎస్ఆర్ సంస్మరణ సమావేశం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

అంతేకాదు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైయస్ విజయమ్మ. వయసుతో సంబంధం లేకుండా కొడుకు విజయం కోసం ఎండనకా వాననకా ఊరువాడా తిరిగారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు,సన్నిహితులు,  మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టులకు విజయమ్మ ఎస్ఎంఎస్ పంపారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో పనిచేసిన వారికి కూడా విజయమ్మ ఈ సమావేశానికి హాజరు కావాలని సమాచారం పంపారు.

vijayamma


వైఎస్ఆర్ వర్ధంతి సెప్టెంబర్ 2వ తేదీన ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టుగా చెబుతున్నారు. అన్ని పార్టీల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న వైఎస్ఆర్ అభిమానులకు ఈ సమావేశానికి ఆహ్వానం పంపిన విషయాన్ని నిర్వాహకులు గుర్తు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఇలా మతం కోణంలో రాజకీయం చేయాలని చూడడానికి ఇది తొలి ప్రయత్నం కాదు. గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగినప్పటికీ.... ఆయన సంక్షేమ పథకాల జోరుతోపాటుగా కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం వల్ల వీలు పడలేదు.


వైఎస్ఆర్ కేబినెట్ లో మంత్రులుగా పనిచేసినవారికి ఆ సమయంలోని ప్రజా ప్రతినిధులకు వైఎస్ కుటుంబంతో సన్నిహితంగా ఉన్న వారందరికీ సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానం పంపారు.

vundavalli arun kumar

హైద్రాబాద్‌లోని ఓ కన్వెన్షన్ హాల్ లో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, కేవీపీ రామచందర్ రావులకూ కూడా ఈ సమావేశానికి రావాలని ఆహ్వానం అందింది.

తన సోదరుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద తాను అలిగినట్లు జరుగుతున్న ప్రచారంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టత ఇచ్చారు.


వైసీపీ గౌరవాధ్యక్షురాలి వైఎస్ విజయమ్మ కొనసాగుతున్నారు. తెలంగాణలో విజయమ్మ కూతురు వైఎస్ షర్మిల వైఎస్ఆర్‌టీపీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీ ప్రారంభోత్సవ సభలో కూడ వైఎస్ విజయమ్మ కీలక పాత్ర పోషించారు.

ys jagan

ఏపీ రాష్ట్రంలో జగన్ కేబినెట్ లో మంత్రులుగా ఉన్న వారికి కూడ విజయమ్మ నుండి ఆహ్వానం అందింది. ఈ సమావేశానికి వైసీపీ కీలక నేతలు హాజరు అవుతారా కారా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. సమావేశానికి రావాలని ఆహ్వానం అందిన విషయాన్ని కొందరు మంత్రులు ధృవీకరిస్తున్నారు.

ఇకపోతే రాయలసీమలో పూర్తిగా ఫ్యాన్ గాలి వీచేలా చేసిన జగన్ మోహన్ రెడ్డికి హిందూపురం నియోజకవర్గం ఒక్కటే కొరకరాని కొయ్యగా మారింది. 2014, 2019 రెండు దఫాల్లో కూడా దాన్నిబాలకృష్ణకు చేజార్చుకోవడంతో... ఎలాగైనా అక్కడ వైసీపీ జెండాను రెపరెపలాడించాలని కంకణం కట్టుకున్నారు. అందుకే ఇక్బాల్ పేరును మరోమారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు.

తెలంగాణలో తమ పార్టీ కార్యక్రమాలు నిర్వహించకూడదని భావించామని వైసీపీ భావించింది. ఒకవేళ ఈ సమావేశానికి వైసీపీ నేతలు, ఏపీ మంత్రులు హాజరైతే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందనే అభిప్రాయంతో కూడ కొందరు మంత్రులున్నారనే ప్రచారం కూడ సాగుతోంది.

pithani satyanarayana

వైఎస్ మంత్రివర్గంలో పనిచేసిన పితాని సత్యనారాయణ ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. ఆయనకూ కూడ ఈ సమావేశానికి రావాలని ఆహ్వానం అందిందని సమాచారం. అయితే ఈ సమావేశానికి వెళ్తే ఏ రకమైన పరిస్థితులు ఉత్పన్నమౌతాయనే విషయమై ఆయన ఆలోచిస్తున్నారని సమాచారం.

sabitha indra reddy

ఇక తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు నేతలకు కూడ విజయమ్మ ఆహ్వానం పంపారు. టీఆర్ఎస్ ఎంపీలు కె.కేశవరావు, డి.శ్రీనివాస్, సరేష్ రెడ్డి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి,  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జీవన్ రెడ్డి తదితరులకు కూడ ఆహ్వానం అందిందని తెలుస్తోంది.

కరోనా వైరస్ కారణంగా చాలాకాలంగా జిల్లాల పర్యటనలకు దూరంగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పర్యటించారు.

సెప్టెంబర్ 2వ తేదీన ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇదుపులపాయలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. సెప్టెంబర్ 1వ తేదీన  ఏపీ సీఎం వైఎస్ జగన్ అమరావతి నుండి కడపకు వెళ్లనున్నారు. 

అభ్యర్ధి ఎంపిక నిర్ణయాన్ని జగన్ కు కట్టబెట్టారు నేతలు. బల్లి దుర్గాప్రసాదరావు తనయుడు కళ్యాణ్ చక్రవర్తితో పాటు పలువురి పేర్లతో పాటు జగన్ వెంట పాదయాత్రలో నడిచిన ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గురుమూర్తి పేరును వైసీపీ పరిశీలిస్తోంది.


కడప నుండి ఇడుపులపాయకు హెలికాప్టర్ లో వెళ్లనున్నారు. అదే రోజు రాత్రి  ఇదుపులపాయలో ఆయన  బఃస చేస్తారు. మరునాడు వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు.వైఎస్ విజయమ్మ నిర్వహించే సభకు  వెళ్లాలా వద్దా అనే విషయమై పలువురు ప్రముఖులు ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.

Vijayamma

ఈ సమావేశానికి సుమారు 300 మందికి పైగా ఆహ్వానం పంపారు వైఎస్ విజయమ్మ. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో చేపట్టిన సంక్షేమ పథకాలు ఇంకా ప్రజల్లో చర్చలో ఉన్నాయని కొందరు ఆయన సన్నిహితులు గుర్తు చేస్తున్నారు.

click me!