తిరుమలకు చేరుకున్న కిషన్ రెడ్డికి టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి స్వాగతం పలికారు. కేంద్ర మంత్రితో పాటు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, మహారాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దామా శేషాద్రి నాయుడు, బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరందరికి టిటిడి ఛైర్మన్ దగ్గరుండి దర్శనం చేయించారు.