చంద్రబాబుకి జగన్ కౌంటర్: విశాఖపై వైసీపీ ప్లాన్ ఇదీ....

First Published Sep 23, 2020, 1:59 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ కు వైసీపీ తెరతీసింది. విశాఖ కేంద్రంగా టీడీపీ ఎమ్మెల్యేలపై వైసీపీ నేతలు ఆపరేషన్ చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలను కూడ తమ వైపుకు తిప్పుకొనే ప్రయత్నాలను వైసీపీ చేస్తోందనే మాటలు విన్పిస్తున్నాయి.

విశాఖ నగరంలోని టీడీపీ ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకోవడం ద్వారా రాజకీయంగా టీడీపీకి చెక్ పెట్టేందుకు వైసీపీ ప్లాన్ చేసింది. విశాఖకు చెందిన మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలపై వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీసిందనే ప్రచారం సాగుతోంది.
undefined
ఏపీ రాష్ట్రంలో మూడు రాజధానుల అంశాన్ని వైసీపీ తెరమీదికి తెచ్చింది. విశాఖపట్టణంలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూల్ లో జ్యూడీషీయల్ కేపిటల్, అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
undefined
మూడు రాజధానుల నిర్ణయాన్ని టీడీపీ సహా ఇతర పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతికి చెందిన రైతులు సుమారు 270 రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
undefined
విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తే రాజకీయంగా తమకు నష్టం జరిగే అవకాశం ఉందని టీడీపీ నేతల్లో అంతర్మథనం నెలకొంది. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ కోరుతూ వైసీపీ నేతలు ఆందోళనల కార్యక్రమాలను విశాఖ కేంద్రంగా నిర్వహిస్తున్నారు. ఈ పరిణామం రాజకీయంగా స్థానిక టీడీపీ నేతలకు ఇబ్బందిగా మారింది.
undefined
మూడు రాజధానుల అంశానికి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని టీడీపీ నమ్మితే విశాఖలోని నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించాలని వైసీపీ డిమాండ్ చేసింది.ఉప ఎన్నికలకు వెళ్తే రాజకీయంగా ఇబ్బందని టీడీపీ భావిస్తోంది.
undefined
మూడు రాజధానుల నిర్ణయానికి సంబంధించి ప్రజలు సానుకూలంగా ఉన్నారని భావిస్తే అసెంబ్లీని రద్దు చేసి ప్రజల తీర్పును కోరాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఈ విషయమై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్దం సాగింది.విశాఖనగరంలోని టీడీపీ ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్ కు వైసీపీ తెరతీసింది.
undefined
త్వరలోనే విశాఖ కార్పోరేషన్ ఎన్నికలు కూడ జరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో తమ సత్తాను చాటాలని వైసీపీ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది.
undefined
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడ వైసీపీలో చేరుతారనే ప్రచారం కూడ సాగింది. అయితే గంటా చేరికను మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని సమాచారం. దీంతో గంటా శ్రీనివాసరావు చేరికను విజయసాయిరెడ్డి ద్వారా అవంతి శ్రీనివాస్ అడ్డుకొన్నారనే ప్రచారం కూడ సాగుతోంది.
undefined
టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబులపై కూడ వైసీపీ తమ పార్టీలో చేర్చుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.
undefined
click me!