తిరుమలలో డిక్లరేషన్: టీటీడీ రూల్స్ ఏం చెబుతున్నాయి

First Published Sep 22, 2020, 4:08 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల డిక్లరేషన్ పైనే రాజకీయాలు సాగుతున్నాయి. అధికార , విపక్షాల మధ్య ఈ విషయమై మాటల యుద్దం సాగుతోంది. సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఏపీ సీఎం వైఎస్ జగన్ తిరుమలలో డిక్లరేషన్ పై సంతకం చేయాలనే విషయమై రాష్ట్రంలో రాజకీయ రగడ సాగుతోంది.అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇంతకాలం డిక్లరేషన్ గురించి మాట్లాడని నేతలు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
undefined
తిరుమల దేవాలయానికి ప్రతి రోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. కరోనా కారణంగా పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చింది. నిమిషానికి 130 మంది భక్తులు స్వామివారిని దర్శించుకొంటారని అంచనా. కరోనా తర్వాత తిరుమలలో ప్రతి రోజూ కేవలం 13 వేల మందికి మాత్రమే స్వామిని దర్శించుకొనే అవకాశం కల్పిస్తున్నారు.
undefined
టీటీడీ రూల్ 136, 137 లలో డిక్లరేషన్ అంశాన్ని తెరమీదికి తెచ్చారు. 136 రూల్ ప్రకారంగా తిరుమల ఆలయంలో హిందూవులు మాత్రమే ప్రవేశానికి అనుమతినిచ్చారు.
undefined
ఈ మేరకు 1990 ఏప్రిల్ 9న 311 జీవోను అప్పటి ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే ఈ ఆలయంలో స్వామి వారిని దర్శించుకొనే ఇతర మతస్తులు డిక్లరేషన్ ఇస్తే అనుమతి ఇవ్వనున్నారు. ఈ మేరకు 2014 ఏప్రిల్ 22న అప్పటి ప్రభుత్వం మెమోను జారీ చేసింది.
undefined
వేషధారణలో అన్యమతస్తులను గుర్తిస్తే డిక్లరేషన్ ఇవ్వాలని రూల్స్ చెబుతున్నాయి. ఆలయానికి వేలాది మంది భక్తులు వస్తుంటారు. అయితే ఎవరు ఏ మతానికి చెందినవారో ఎలా గుర్తిస్తారనే చర్చ కూడ తెరమీదికి వచ్చింది.
undefined
దీంతో స్వచ్ఛంధంగా డిక్లరేషన్ ఇవ్వాలనే అంశం తెరమీదికి వచ్చింది.డిక్లరేషన్ ఇచ్చిన అన్యమతస్తులకు స్వామివారిని దర్శించుకొనే అవకాశం కల్పించనుంది. ఆలయ పేష్కార్ కు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.అయితే 1990 నుండి వేళ్ల మీద లెక్కించదగిన వాళ్లే డిక్లరేషన్ సమర్పించినట్టుగా టీటీడీ మాజీ సభ్యుడొకరు అభిప్రాయపడుతున్నారు.
undefined
click me!