ఏపీ సీఎం జగన్ కు రాఖీ కట్టి... సోదర ప్రేమను చాటుకున్న మహిళా మంత్రులు (Photos)
First Published Aug 11, 2022, 1:46 PM ISTఅమరావతి : ఆడపడుచులు తమ సోదరులతో ప్రేమానురాగాలు పంచుకుంటూ ఆనందోత్సాహాలతో జరుపుకునే పండగ రక్షాబంధన్. ఈ పండగ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాఖీ కట్టి సోదరిలా మారారు మంత్రులు తానేటి వనిత, విడదల రజిని. అలాగే రాష్ట్ర మహిళా కమీషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్రమాని విజయనిర్మల, రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, మహిళా కమిషన్ సభ్యులు కర్రి జయశ్రీ, గెడ్డం ఉమ లు కూడా జగన్ కు రాఖీ కట్టారు.
ఇక ఈశ్వరీయ బ్రహ్మకుమారి ప్రతినిధులు రాజయోగిని శాంత దీదీ, సిస్టర్స్ పద్మజ, మానస తదితరులు కూడా సీఎం జగన్ ను కలిసి రాఖీ కట్టారు. సెప్టెంబర్ లో రాజస్థాన్ లోని మౌంట్ అబూలో అజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా జరిగే గ్లోబల్ సమ్మిట్ కు హాజరవ్వాల్సిందిగా సీఎం జగన్ ను బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు ఆహ్వానించారు.