తిరుపతిలో చావో రేవో: విజయానికి ఐదంచెల వ్యూహాంతో టీడీపీ

First Published Jan 5, 2021, 12:41 PM IST

తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం సాధించడానికి టీడీపీ ఇప్పటి నుండి కసరత్తును ప్రారంభించింది. ఐదంచెల వ్యూహాంతో ఆ పార్టీ ఈ ఎన్నికలకు వెళ్తోంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని ఆ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోనేందుకు టీడీపీ సిద్దమైంది. 2019 ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 23 అసెంబ్లీ స్థానాలకే ఆ పార్టీ పరిమితమైంది.
undefined
తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.
undefined
తిరుపతి ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆ పార్లీ ఇప్పటి నుండే పావులు కదుపుతోంది. మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ఈ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగనుంది.
undefined
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు టీడీపీ నాయకత్వం ఇప్పటి నుండే ప్రయత్నిస్తోంది. ఈ ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది.
undefined
టీడీపీకి ఎన్నికల సమన్వయకర్తగా రాబిన్ శర్మ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఆయన తిరుపతి ఎంపీ స్థానంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించి స్థానికంగా ఉన్న పరిస్థితుల ఆధారంగా పార్టీ నాయకత్వానికి నివేదిక అందించారు.
undefined
స్థానికంగా ఉన్న నేతలతో ఆయన సమావేశమై అవసరమైన సూచనలు, సలహాలు అందించారు. ఈ ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన వ్యూహాంపై టీడీపీ నాయకత్వానికి రాబిన్ శర్మ కొన్ని సూచనలు చేసినట్టుగా సమాచారం.
undefined
ఈ ఉప ఎన్నికల్లో విజయం కోసం టీడీపీ ఐదంచెల వ్యూహాన్ని అమలు చేస్తోంది. ప్రతి ఓటరును కలుసుకొనేందుకు వీలుగా టీడీపీ నాయకత్వం ప్లాన్ చేసింది. ఈ నియోజకవర్గం పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో పనిచేసేందుకు 8 వేల మంది కార్యకర్తలను ఎంపిక చేశారు.
undefined
గ్రామ పంచాయితీ స్థాయిల్లో పనిచేసేందుకు గాను వెయ్యి మంది కార్యకర్తలను నియమించారు. మండలస్థాయిల్లో పనిచేసేందుకు 40 మంది బాధ్యతలు అప్పగించారు. అన్ని మండలాల పర్యవేక్షణకు 89 మందితో కమిటీని నియమించారు
undefined
తిరుపతి ఎంపీ స్థానం నుండి విజయం దక్కితే శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంటుందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. రాష్ట్రంలో బీజేపీ దూకుడుకు కూడ చెక్ పెట్టే అవకాశం కలగనుందని టీడీపీ చీప్ భావిస్తున్నారు. వైసీపీకి తామే ప్రత్యామ్నాయం అని బీజేపీ నేతలు ఇటీవల చేస్తున్న ప్రచారానికి చెక్ పెట్టడానికి ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని టీడీపీ భావిస్తోంది.
undefined
చిత్తూరు జిల్లాకు చెందిన నేతలతో టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు సమావేశమై తిరుపతి ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలపై చర్చించారు.
undefined
ఈ నెల 6వ తేదీ నుండి తిరుపతి ఎంపీ స్థానం నుండి వైఎస్ఆర్‌సీపీ ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ప్రజా ప్రతినిధులు ఇటీవల తిరుపతిలో సమావేశమై తిరుపతి ఎంపీ స్థానంలో అనుసరించాల్సిన వ్యూహాంపై వైసీపీ చర్చించింది.
undefined
ఈ స్థానం నుండి బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధి బరిలోకి దిగనున్నారు. ఈ స్థానంలో తమ పార్టీకి చెందిన అభ్యర్ధిని బరిలోకి దింపాలని జనసేన పార్టీ భావిస్తోంది.బీజేపీ కూడ ఈ స్థానంలో తమ అభ్యర్ధినే బరిలోకి దింపాలని పావులు కదుపులోంది. ఈ స్థానం నుండి ఏ పార్టీ అభ్యర్ధిని బరిలోకి దింపుతారనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
undefined
click me!