Published : Feb 16, 2021, 04:57 PM ISTUpdated : Feb 16, 2021, 05:00 PM IST
విశాఖపట్నంలో ఇవాళ(మంగళవారం) టిడిపి అధినేత చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఉక్కు ప్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టిడిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి ఆయన రోడ్ షో ను చేపట్టారు. అనంతరం విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం గత ఐదురోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న టిడిపి నాయకులు పల్లా శ్రీనివాస్ ను పరామర్శించారు. అతడి ఆరోగ్యం క్షీణిస్తుండటంతో నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.