వైసిపికి షాక్... లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిన నాయకుడు, కార్యకర్తలు
First Published Apr 5, 2021, 4:56 PM ISTతిరుపతి ఉపఎన్నికలకు ముందు అధికార వైసిపికి షాక్ తగిలింది. శ్రీకాళహస్తి నియోజకవర్గం పోలి గ్రామానికి చెందిన వైసిపి నేత డాక్టర్ జనార్దన్, పలువురు కార్యకర్తలు టిడిపిలో చేరారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. స్వయంగా లోకేషే జనార్ధన్ తో పాటు వైసిపి కార్యకర్తలకు టిడిపి కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.