నూతన ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించిన మండలి ఛైర్మన్

First Published Apr 1, 2021, 3:53 PM IST

మండలి చైర్మన్ ఎం.ఎ.షరీఫ్ అసెంబ్లీలోని తన కార్యాలయంలో గురువారం నూతన ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి నూతన సభ్యులుగా కరీమున్నీషా, దువ్వాడ శ్రీనివాసరావు, షేక్ మహ్మద్ ఇక్బాల్, బల్లి కల్యాణ్ చక్రవర్తి, సి.రామచంద్రయ్య, షేక్ సాబ్జి ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ ఎం.ఎ.షరీఫ్ అసెంబ్లీలోని తన కార్యాలయంలో గురువారం నూతన ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించారు.
undefined
undefined
శాసన సభ్యుల కోటాలో కరీమున్నీషా, దువ్వాడ శ్రీనివాసరావు, బల్లి కల్యాణ్ చక్రవర్తి, సి.రామచంద్రయ్య శాసన మండలి సభ్యులుగా ఎన్నికయ్యారు.
undefined
షేక్ సాబ్జి ఇటీవల జరిగిన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజక వర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు.
undefined
ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులకు మండలి చైర్మన్ ఎం.ఎ.షరీఫ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, శాసన మండలి నియమావళిని అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు అజాంద్ బాషా, ధర్మాన కృష్ణదాస్, అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణామాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
undefined
click me!