
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటుకు గవర్నర్ ఆమోదముద్రతో లైన్ క్లియర్ అయింది. దాదాపుగా గత ఆరు నెలలుగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న అమరావతి అంశం ఇక ఒక సమాప్తమైన అంకంగా మిగిలిపోనుంది. గవర్నర్ నిన్న దీనిపై సంతకం పెట్టినప్పటికీ.... ప్రభుత్వం మాత్రం ఈ విషయంపై చాలా సీరియస్ గా ఉందని అసెంబ్లీ లో జగన్ వ్యాఖ్యానించినప్పటినుండే అర్థమయింది.
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటుకు గవర్నర్ ఆమోదముద్రతో లైన్ క్లియర్ అయింది. దాదాపుగా గత ఆరు నెలలుగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న అమరావతి అంశం ఇక ఒక సమాప్తమైన అంకంగా మిగిలిపోనుంది. గవర్నర్ నిన్న దీనిపై సంతకం పెట్టినప్పటికీ.... ప్రభుత్వం మాత్రం ఈ విషయంపై చాలా సీరియస్ గా ఉందని అసెంబ్లీ లో జగన్ వ్యాఖ్యానించినప్పటినుండే అర్థమయింది.
మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల విషయాన్ని ప్రస్తావించినప్పుడే అధికార వైసీపీ ఈ విషయంలో ఎంత పట్టుదలతో వుందో మనకు అర్థమవుతుంది. వాస్తవానికి జగన్ ఈ ప్రస్తావన అసెంబ్లీలో 2019లో తెచ్చినప్పుడే జగన్ ఈ నిర్ణయాన్ని తీసేసుకున్నాడు.
మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల విషయాన్ని ప్రస్తావించినప్పుడే అధికార వైసీపీ ఈ విషయంలో ఎంత పట్టుదలతో వుందో మనకు అర్థమవుతుంది. వాస్తవానికి జగన్ ఈ ప్రస్తావన అసెంబ్లీలో 2019లో తెచ్చినప్పుడే జగన్ ఈ నిర్ణయాన్ని తీసేసుకున్నాడు.
అప్పటినుండి వారు విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేయడానికి అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. కానీ మధ్యలో కోర్టులు, ఈ వ్యవహారం వల్ల కాష్ఠంత ఆలస్యం అయింది. ఇప్పుడు పూర్తిగా లైన్ క్లియర్ అవడంతో.... విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు తథ్యం. తొలుత తరలి వెళ్ళేది సీఎం కార్యాలయం అనే సంకేతాలు కూడా వెలువడుతున్నాయి.
అప్పటినుండి వారు విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేయడానికి అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. కానీ మధ్యలో కోర్టులు, ఈ వ్యవహారం వల్ల కాష్ఠంత ఆలస్యం అయింది. ఇప్పుడు పూర్తిగా లైన్ క్లియర్ అవడంతో.... విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు తథ్యం. తొలుత తరలి వెళ్ళేది సీఎం కార్యాలయం అనే సంకేతాలు కూడా వెలువడుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో విశాఖలో ముఖ్యమంత్రి కార్యాలయంతోసహా మిగిలిన కార్యాలయాలను కూడా ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారనే విషయంలో ఆసక్తి నెలకొంది. ఇటీవలి కాలంలో ప్రభుత్వంలోని కొందరు ముఖ్యులైన అధికారులు తరచుగా విశాఖ పర్యటిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో విశాఖలో ముఖ్యమంత్రి కార్యాలయంతోసహా మిగిలిన కార్యాలయాలను కూడా ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారనే విషయంలో ఆసక్తి నెలకొంది. ఇటీవలి కాలంలో ప్రభుత్వంలోని కొందరు ముఖ్యులైన అధికారులు తరచుగా విశాఖ పర్యటిస్తున్నారు.
ఇటీవల అధికారులు వరుసగా కాపులుప్పాడలోని గ్రేహౌండ్స్ భవనాన్ని, రుషికొండ మిలీనియం టవర్లోని స్టార్టప్ విలేజ్ ను, న్యూ నెట్ ఐటీ ఆఫీసు భవనాలను సందర్శించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ సైతం ఈ భవనాలను సందర్శించారు.
ఇటీవల అధికారులు వరుసగా కాపులుప్పాడలోని గ్రేహౌండ్స్ భవనాన్ని, రుషికొండ మిలీనియం టవర్లోని స్టార్టప్ విలేజ్ ను, న్యూ నెట్ ఐటీ ఆఫీసు భవనాలను సందర్శించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ సైతం ఈ భవనాలను సందర్శించారు.
దీనితో కాపులుప్పాడలోని గ్రేహౌండ్స్ భవనాన్ని లేదా రుషికొండ మిలీనియం టవర్లోని స్టార్టప్ విలేజ్ ను ముఖ్యమంత్రి కార్యాలయంగా ఏర్పాటు చేయనున్నట్టుగా వార్తలు వినబడుతున్నాయి. న్యూ నెట్ ఐటీ ఆఫీస్ ను పోలీసు కార్యాలయంగా ఏర్పాటు చేస్తారని అంటున్నారు.
దీనితో కాపులుప్పాడలోని గ్రేహౌండ్స్ భవనాన్ని లేదా రుషికొండ మిలీనియం టవర్లోని స్టార్టప్ విలేజ్ ను ముఖ్యమంత్రి కార్యాలయంగా ఏర్పాటు చేయనున్నట్టుగా వార్తలు వినబడుతున్నాయి. న్యూ నెట్ ఐటీ ఆఫీస్ ను పోలీసు కార్యాలయంగా ఏర్పాటు చేస్తారని అంటున్నారు.
తొలుతగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని తరలించాలని చూస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని గనుక అక్కడకు తరలించి, అక్కడినుండి గనుక ముఖ్యమంత్రి పనిచెయ్యడం ఆరంభిస్తే విశాఖ కార్యనిర్వాహక రాజధాని అనేది అధికారికంగా ప్రారంభమయింది అనే సంకేతం వెలువడుతుంది.
తొలుతగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని తరలించాలని చూస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని గనుక అక్కడకు తరలించి, అక్కడినుండి గనుక ముఖ్యమంత్రి పనిచెయ్యడం ఆరంభిస్తే విశాఖ కార్యనిర్వాహక రాజధాని అనేది అధికారికంగా ప్రారంభమయింది అనే సంకేతం వెలువడుతుంది.
తొలుత ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే విశాఖకు వెళ్లినా, మిగిలిన అధికారులు అంతా కూడా త్వరలోనే అక్కడకు తమ కార్యాలయాలను మార్చుకోక తప్పదు. ముఖ్యంగా సచివాలయం అక్కడకు మారాల్సి ఉంటుంది. ఈ విషయమై అధికారులు ఇప్పటికే అక్కడ భవనాలను వెదికే పనిలో పడ్డారు.
తొలుత ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే విశాఖకు వెళ్లినా, మిగిలిన అధికారులు అంతా కూడా త్వరలోనే అక్కడకు తమ కార్యాలయాలను మార్చుకోక తప్పదు. ముఖ్యంగా సచివాలయం అక్కడకు మారాల్సి ఉంటుంది. ఈ విషయమై అధికారులు ఇప్పటికే అక్కడ భవనాలను వెదికే పనిలో పడ్డారు.
హెచ్ఓడి కార్యాలయాలను అక్కడకు తరలిస్తే ఎక్కడెక్కడ వాటిని ఏర్పాటు చేయాలి, ఏయే భవనాలు ఖాళీగా ఉన్నాయి అని వెతుకులాట ఎప్పుడో మొదలుపెట్టారు. ఖాళీగా ఉన్న భవనాల లిస్టులను ముఖ్య అధికారుల కార్యాలయాలకు చేరుకున్నాయట కూడా.
హెచ్ఓడి కార్యాలయాలను అక్కడకు తరలిస్తే ఎక్కడెక్కడ వాటిని ఏర్పాటు చేయాలి, ఏయే భవనాలు ఖాళీగా ఉన్నాయి అని వెతుకులాట ఎప్పుడో మొదలుపెట్టారు. ఖాళీగా ఉన్న భవనాల లిస్టులను ముఖ్య అధికారుల కార్యాలయాలకు చేరుకున్నాయట కూడా.
స్వతంత్ర దినోత్సవం నాడు జెండాను జగన్ మోహన్ రెడ్డి విశాఖలో ఎగురవేయాలని అనుకుంటున్నారు. వాస్తవానికి గణతంత్ర వేడుకలు విశాఖలో నిర్వహించాలని తలపెట్టినప్పటికీ... ఆఖరు నిమిషంలో విరమించుకున్న విషయం తెలిసిందే..!
స్వతంత్ర దినోత్సవం నాడు జెండాను జగన్ మోహన్ రెడ్డి విశాఖలో ఎగురవేయాలని అనుకుంటున్నారు. వాస్తవానికి గణతంత్ర వేడుకలు విశాఖలో నిర్వహించాలని తలపెట్టినప్పటికీ... ఆఖరు నిమిషంలో విరమించుకున్న విషయం తెలిసిందే..!